సిద్ధూకి ఉపముఖ్యమంత్రి పదవి ఊసే లేదు...!
- March 16, 2017
మాజీ స్టార్ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ కేబినెట్ మంత్రిగానే ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మిగతా కేబినెట్ మంత్రులతో కలసి ప్రమాణం చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గతేడాది బీజేపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన ఆయన తొలుత ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సీఎం పదవి తనకు ముఖ్యం కాదని చెబుతూ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేశారు. సిక్కులు అత్యధిక ప్రభావం గల పంజాబ్లో సిద్ధూ రాక కాంగ్రెస్కి బాగానే లాభించింది.
ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ సహా మిగతా నాలుగు చోట్ల కాంగ్రెస్ నిరాశే ఎదురైనా... పంజాబ్లో మాత్రం భారీ మెజార్టీతో ఊరట లభించింది. తీరా తాజాగా కొలువుదీరిన ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పదవి అయినా ఇస్తారని అంతా భావించారు. కానీ ఆయన కేబినెట్ మంత్రిగానే ప్రమాణం చేశారు.
ప్రమాణం అనంతరం సిద్ధూ ముఖ్యమంత్రి అమరీందర్ పాదాలకు వినమ్రంగా నమస్కరించాడు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తిగత ప్రాధమ్యాలు రెండోస్థానంలోకి వెళతాయనేందుకు సిద్ధూ ఇవాళ వేదికపై ప్రవర్తించిన తీరే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







