త్వరలో కింగ్ హేమాడ్ కాజ్వే పనులు ప్రారంభం
- March 16, 2017
మనామా:బహ్రెయిన్, సౌదీ అరేబియా రెండు రాజ్యాలను అనుసంధానం చేస్తూ రెండవ వంతెన యొక్క సాధ్యత గూర్చి10 బిలియన్ డాలర్ల కింగ్ హేమాడ్ కాజ్వే పై అధ్యయనం పూర్తి చేశారు. రెండు దేశాలు మధ్య వేగంగా ప్రాజెక్ట్ పని ప్రారంభించటానికి ఇంజనీరింగ్ ప్రణాళికలు ఇటీవల సిద్ధం చేసుకొని నిర్మాణ పనులు ప్రారంభించేందుకు నిర్ణయించుకుంది. మనామాలో సౌదీ ఎంబసీ ఇది ప్రస్తుతం కింగ్ హేమాడ్ కాజ్వే నిర్మాణం పద్ధతులు అధ్యయనం గూర్చి వివరిస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంటూ ధ్రువీకరించారు. కింగ్డమ్ లో సౌదీ రాయబారి అబ్దుల్లా అల్ అల్షిఖ్ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక లావాదేవీలను పెంచుతుందని చెప్పారు. ఈ సదుపాయం ద్వారా రెండు రాజ్యాలు తమ తమ ఆర్థిక పునరుద్ధరణకు మార్గం ఏర్పరచుకొంటుందని అన్నారు. కొత్తగా నిర్మించనున్న 25-కిమీ పొడవున్న ఈ వంతెన ద్వారా తూర్పు సౌదీ తీరం, ద్వీపం యొక్క ఉత్తర తీరాలను కలుపుతుంది. వాహనాలతో పాటు సరుకుని ప్యాసింజర్ రైళ్లు ద్వారా రవాణా చేస్తూ ఈ వంతెన ఉపయోగించబడుతుంది.అంతేకాక ఈ కాజ్వే రెండు రాజ్యాల మధ్య, వాణిజ్య, ఆర్ధిక మరియు సాంఘిక సంబంధాలను బలోపేతం చేసే, అది నుండి కువైట్ వరకు ఒమాన్ మండలిలోని ఆరుగురు సభ్య దేశాలను కలిపే ఉమ్మడి జీసీసీ రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఉంటుందని ప్రకటించారు.గతంలో నివేదించిన ప్రకారం, కింగ్ హేమాడ్ కాజ్వే రెండవ వంతెన బ్రిడ్జి ఇరు ప్రాంతాలను కలుపుతుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









