అరుదైన గౌరవం తగ్గించుకున్న గుత్తా జ్వాలా
- March 16, 2017
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాకు అరుదైన గౌరవం దక్కింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) పాలక మండలి సభ్యురాలిగా ఆమె నియమితురాలయ్యారు. శాయ్ కార్యదర్శి ఎస్ఎస్ ఛాబ్రా నుంచి ఈ మేరకు గుత్తా జ్వాలాకు లేఖ అందింది.
దేశంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందని శాయ్ కార్యదర్శి ఎస్ఎస్ ఛాబ్రా తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా జ్వాలా ఆనందం వ్యక్తం చేశారు. శాయ్ సభ్యురాలిగా తనను నియమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ నిర్ణయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, శాయ్ అధికారులు రెండు రోజుల క్రితం తనకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపారని ఆమె వెల్లడించారు.
శాయ్లో తన విధులు, బాధ్యతలు ఇంకా తెలియనప్పటికీ, ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో శాయ్తో తన మొదటి సమావేశం ఉంటుందని అన్నారు.
దేశ క్రీడారంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. క్రీడారంగానికి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ అనుకునేదాన్నని ఆమె పేర్కొన్నారు. కాగా, 14 సార్లు జాతీయ ఛాంపియన్ అయిన జ్వాలా ప్రస్తుతం డబుల్స్లో సత్తా చాటుతోంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ పతకం సాధించింది.
దీంతో పాటు 2011 ప్రపంచ ఛాంపియన్ షిప్లో రజతం సాధించింది. గుత్తా జ్వాలా భారత్ తరఫున ఒలింపిక్స్లో రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. వీటితో పాటు 2014 గ్లాస్వో గేమ్స్ మహిళల డబుల్స్ విజేతగా నిలిచింది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









