అక్షయ్ కోటి సాయం అమర జవాన్లకు
- March 16, 2017ఛత్తీస్గఢ్లో నక్సల్స్ దాడిలో వీరమరణం పొందిన ఒక్కో సీఆర్పీఎఫ్ జవాను కుటుంబానికి రూ.9లక్షల చొప్పున నగదును (మొత్తంగా కోటీ ఎనిమిది లక్షలు) బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అందజేశారు. మార్చి 11న సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ దాడిలో 12 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
దాడి విషయం తెల్సుకుని, జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ను అక్షయ్ సంప్రదించారని అధికారులు వెల్లడించారు. జవాన్ల కుటుంబీకుల బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని బుధవారం ఆయా ఖాతాలకు అక్షయ్ నగదును బదిలీచేశారని చెప్పారు. దేశభక్తిని చాటడంతో అక్షయ్ ఎల్లపుడూ ముందుంటారని, ప్రత్యేకంగా సీఆర్పీఎఫ్ బలగాల విషయంలో అంకిత భావంతో ఉంటారని సీఆర్పీఎఫ్ పేర్కొంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం