అక్షయ్‌ కోటి సాయం అమర జవాన్లకు

- March 16, 2017 , by Maagulf
అక్షయ్‌ కోటి సాయం అమర జవాన్లకు

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ దాడిలో వీరమరణం పొందిన ఒక్కో సీఆర్‌పీఎఫ్‌ జవాను కుటుంబానికి రూ.9లక్షల చొప్పున నగదును (మొత్తంగా కోటీ ఎనిమిది లక్షలు) బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ అందజేశారు. మార్చి 11న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై నక్సల్స్‌ దాడిలో 12 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
దాడి విషయం తెల్సుకుని, జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ను అక్షయ్‌ సంప్రదించారని అధికారులు వెల్లడించారు. జవాన్ల కుటుంబీకుల బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని బుధవారం ఆయా ఖాతాలకు అక్షయ్‌ నగదును బదిలీచేశారని చెప్పారు. దేశభక్తిని చాటడంతో అక్షయ్‌ ఎల్లపుడూ ముందుంటారని, ప్రత్యేకంగా సీఆర్‌పీఎఫ్‌ బలగాల విషయంలో అంకిత భావంతో ఉంటారని సీఆర్‌పీఎఫ్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com