అక్షయ్ కోటి సాయం అమర జవాన్లకు
- March 16, 2017
ఛత్తీస్గఢ్లో నక్సల్స్ దాడిలో వీరమరణం పొందిన ఒక్కో సీఆర్పీఎఫ్ జవాను కుటుంబానికి రూ.9లక్షల చొప్పున నగదును (మొత్తంగా కోటీ ఎనిమిది లక్షలు) బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అందజేశారు. మార్చి 11న సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ దాడిలో 12 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
దాడి విషయం తెల్సుకుని, జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ను అక్షయ్ సంప్రదించారని అధికారులు వెల్లడించారు. జవాన్ల కుటుంబీకుల బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని బుధవారం ఆయా ఖాతాలకు అక్షయ్ నగదును బదిలీచేశారని చెప్పారు. దేశభక్తిని చాటడంతో అక్షయ్ ఎల్లపుడూ ముందుంటారని, ప్రత్యేకంగా సీఆర్పీఎఫ్ బలగాల విషయంలో అంకిత భావంతో ఉంటారని సీఆర్పీఎఫ్ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









