గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ అందుకోనున్న దర్శకుడు హేమంతరావు
- March 16, 2017
నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ పేరు మీద ప్రతి యేటా ఉత్తమ నూతన దర్శకుడికి అవార్డ్ అందజేస్తారు అన్న సంగతి విధితమే.. కాగా 2016 ఏడాదికి గాను గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం కన్నడ దర్శకుడు హేమంతరావు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో కొత్త దర్శకులు తెరకెక్కించిన 20 ఉత్తమ చిత్రాల్లో హేమంత్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం 'గోది బన్నసాధరణ మైకట్టు' సినిమా సీనియర్ నటి పూర్ణిమ భాగ్యరాజ్, సీనియర్ దర్శకుడు రాజేంద్రసింగ్బాబు తదితరులతో కూడిన జ్యూరీని మెప్పించింది. 20వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారాన్ని వచ్చే ఆగస్టు 12వ తేదీన చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ వేదికగా ప్రదానం చేయనున్నట్లు గొల్లపూడి తనయులు సుబ్బారావు, రామకృష్ణ వెల్లడించారు. పురస్కారం కింద రూ.1.50 లక్షల నగదు, జ్ఞాపిక అందిస్తారు. కాగా, గతంలో ఈ పురస్కారాలను అందుకున్న ఉత్తమ నూతన దర్శకుల్లో హిందీ నటుడు అమీర్ఖాన (తారే జమీనపర్), తెలుగు దర్శకులు మోహనకృష్ణ (గ్రహణం), రాజనీష్ దోమలపల్లి (వనజ) తదితరులు ఉన్నారు. 1992లో తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ప్రమాదవశాత్తు విశాఖ సముద్రతీరాన మరణించిన ప్రముఖ తెలుగు నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు పెద్ద కుమారుడు శ్రీనివాస్ స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు 19 ఏళ్లుగా అవార్డు ప్రదానం చేస్తున్నారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









