గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ అందుకోనున్న దర్శకుడు హేమంతరావు
- March 16, 2017
నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ పేరు మీద ప్రతి యేటా ఉత్తమ నూతన దర్శకుడికి అవార్డ్ అందజేస్తారు అన్న సంగతి విధితమే.. కాగా 2016 ఏడాదికి గాను గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం కన్నడ దర్శకుడు హేమంతరావు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో కొత్త దర్శకులు తెరకెక్కించిన 20 ఉత్తమ చిత్రాల్లో హేమంత్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం 'గోది బన్నసాధరణ మైకట్టు' సినిమా సీనియర్ నటి పూర్ణిమ భాగ్యరాజ్, సీనియర్ దర్శకుడు రాజేంద్రసింగ్బాబు తదితరులతో కూడిన జ్యూరీని మెప్పించింది. 20వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారాన్ని వచ్చే ఆగస్టు 12వ తేదీన చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ వేదికగా ప్రదానం చేయనున్నట్లు గొల్లపూడి తనయులు సుబ్బారావు, రామకృష్ణ వెల్లడించారు. పురస్కారం కింద రూ.1.50 లక్షల నగదు, జ్ఞాపిక అందిస్తారు. కాగా, గతంలో ఈ పురస్కారాలను అందుకున్న ఉత్తమ నూతన దర్శకుల్లో హిందీ నటుడు అమీర్ఖాన (తారే జమీనపర్), తెలుగు దర్శకులు మోహనకృష్ణ (గ్రహణం), రాజనీష్ దోమలపల్లి (వనజ) తదితరులు ఉన్నారు. 1992లో తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ప్రమాదవశాత్తు విశాఖ సముద్రతీరాన మరణించిన ప్రముఖ తెలుగు నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు పెద్ద కుమారుడు శ్రీనివాస్ స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు 19 ఏళ్లుగా అవార్డు ప్రదానం చేస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







