అక్షయ్ కోటి సాయం అమర జవాన్లకు
- March 16, 2017
ఛత్తీస్గఢ్లో నక్సల్స్ దాడిలో వీరమరణం పొందిన ఒక్కో సీఆర్పీఎఫ్ జవాను కుటుంబానికి రూ.9లక్షల చొప్పున నగదును (మొత్తంగా కోటీ ఎనిమిది లక్షలు) బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అందజేశారు. మార్చి 11న సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ దాడిలో 12 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
దాడి విషయం తెల్సుకుని, జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ను అక్షయ్ సంప్రదించారని అధికారులు వెల్లడించారు. జవాన్ల కుటుంబీకుల బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని బుధవారం ఆయా ఖాతాలకు అక్షయ్ నగదును బదిలీచేశారని చెప్పారు. దేశభక్తిని చాటడంతో అక్షయ్ ఎల్లపుడూ ముందుంటారని, ప్రత్యేకంగా సీఆర్పీఎఫ్ బలగాల విషయంలో అంకిత భావంతో ఉంటారని సీఆర్పీఎఫ్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









