నిండా ముంచిన మోడీ తెలుగు రాష్ట్రాల ప్రజలను
- March 16, 2017
తెలుగు రాష్ట్రాల ప్రజలను మోడీ ముంచడం ఏంటని ఆలోచిస్తున్నారా..? అవును నిజం తెలుగు రాష్ట్రాల ప్రజలను మోడీ మోసం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులకు రుణ మాఫీ చేస్తామని హాపీ ఇచ్చిన మోడీ ఆ తర్వాత మావల్ల కాదంటూ చేతులు ఎత్తేసారు. మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రైతుల రుణ మాఫీ చేతామని హామీ ఇచ్చి ఏకంగా 48 వేల కోట్ల రూపాయలను మాఫీ చేసి యూపీ అధికారాన్ని సొంతం చేసుకుంది కమల దళం. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయారు.
కారణం తెలుగు రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వమే అధికారంలో ఉండడం.
దేశ ప్రధాని స్థానంలో ఉన్న మోడీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన మోడీ రాష్ట్రాలపై వివక్ష చూపడం ఆయన పదవికి ఇది ఎంత మాత్రం తగదని రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రుణాల మాఫీ ప్రధాని హామీ ఇచ్చిన ఉత్తర ప్రదేశ్కే పరిమితం చేయకుండా దేశమంతటా అమలు చేయాలని లోక్సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే.. తన 90 నిమిషాల ప్రసంగంలో ఎక్కడా రాధామోహన్ సింగ్ ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీని కేంద్రం భరించే ప్రస్తావనే తేకపోవడం గమనార్హం.
దీంతో.. ''మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రా? లేక యూపీకా?'' అని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ''వ్యవసాయ రుణాల మాఫీ వల్ల రుణగ్రహీతల్లో (అంటే రైతుల్లో) క్రమశిక్షణ కట్టు తప్పుతుంది. ఒకసారి ఇలాంటి మాఫీ పొందినవారు తదుపరి కూడా ఇదే తరహా మాఫీలుంటాయన్న ఆశతో భవిష్యత్తు రుణాలను కూడా చెల్లించకుండా ఎగవేస్తారు. మున్ముందు తీసుకునే రుణాల మాఫీ కోసం వచ్చే ఎన్నికల వరకూ ఎదురుచూస్తారు. దీనివల్ల క్రమశిక్షణ దెబ్బతినడం ఖాయం.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









