బహ్రెయిన్ న్యూ ప్రమోషన్
- September 26, 2015
బహ్రెయిన్లో పరిస్థితులపై మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతుండడంతో ప్రపంచానికి బహ్రెయిన్ని కొత్తగా పరిచయం చేయడం, బహ్రెయిన్పై ఉన్న అనుమానాల్ని నివృత్తి కలిగించడం వంటి ఉద్దేశ్యాలతో ఓ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మిడిల్ ఈస్ట్ మీడియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎంఇఎంఆర్ఐ)తో బహ్రెయిన్ ప్రచార కర్తలు ఎంఓయూ చేసుకున్నారు. 'ఇదీ బహ్రెయిన్' పేరుతో బహ్రెయిన్ గొప్పతనాన్ని చాటాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంఇఎంఆర్ఐ ఉపాధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్తో బహ్రెయిన్ ఎక్స్పాట్రియేట్స్ అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ బెట్సీ మాథీసన్ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. 200 మంది సభ్యులు గల ప్రతినిథి బృందం వాషింగ్టన్ మరియు న్యూయార్క్ని మంగళవారం సందర్శించనున్నాయి. అక్కడే ఓ కాన్ఫరెన్స మరియు ఎగ్జిబిషన్ని కూడా నిర్వహిస్తారు. బహ్రెయిన్లో ఏళ్ళ తరబడి ప్రశాంత జీవనం సాగుతుండడం, వివిధ మతాలకు చెందినవారు పరస్పరం గౌరవించుకోవడం వంటి విషయాల్ని ఇక్కడ ప్రమోట్ చేస్తారు. సామాజిక సఖ్యతలో ప్రపంచం చాలా చిన్నదైపోయిందని, అన్ని మతాలూ కలిసి స్వేచ్ఛగా జీవించడం ముఖ్యమని ప్రతినిథులు భావిస్తూ, బహ్రెయిన్ని ప్రమోట్ చేయనున్నారు.
--యం.వాసు దేవా రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







