క్రిమియన్-కాంగో జ్వరం ముగ్గురు మృతి ఒమాన్ లో ప్రబలుతున్న చిక్కులు
- March 20, 2017
మస్కట్:ఒమాన్ లో చాప కింద నీరు మాదిరిగా ఓ ప్రాణాంతక వ్యాధి కబళిస్తుంది. క్రిమియన్-కాంగో రక్తస్రావంతో కూడిన జ్వరం కారణంగా ముగ్గురు వ్యక్తులు ఇటీవల మరణించగా మరో ఆరుగురు 2017 మొదటి నెలల నుంచి ఆ (సి సి హెచ్ ఎఫ్) చికిత్స చేయించేందుకు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం క్రిమియన్-కాంగో జ్వరం కారణంగా సంభవించిన మరణాల రేటు ప్రస్తుతం 37.5 శాతంగా నమోదైందని అని పేర్కొన్నారు. సి సి హెచ్ ఎఫ్ పెరుగుదల కాబడిన సందర్భాల్లో 2016 లో ఇదే కాలంలో పోలిస్తే కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి సి సి హెచ్ ఎఫ్ ఇది ఒక టిక్ అనే వైరస్ వలన కలిగే వ్యాధి. ఆవులు, మేకలు మరియు గొర్రెలు తదితర జంతువుల ప్రభావితంగా మానవులకు సంక్రమించే ఓకే వ్యాధి. టిక్ జీవిగా పేరొందిన ఆ ప్రాణి నేరుగా మనిషిని కుట్టడం ద్వారా శరీరంలోని రక్తం లోనికి ప్రవేశిస్తుంది. లేదా ఆ జంతువుని వదించే సమయంలో వ్యక్తికి ఆ జబ్బు సోకిన జంతువుల ' రక్తం లేదా అవయవాలలో దాగి ఉన్న ఆ జీవి మాంసం నరికే వ్యకిని కుట్టి అతని శరీరంలోనికి ప్రవేశిస్తాయి. దాంతో క్రిమియన్-కాంగో రక్తస్రావంతో కూడిన జ్వరం రావడం క్రమేపి ఆ వ్యక్తి మరణించడం జరుగుతుంది.ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం మరొక మార్గం ఏమిటంటే, ఆ జబ్బు సోకిన వ్యక్తికి చెందిన రక్తం లేదా ఇతర శరీర ద్రవాలు మరొక వ్యక్తి బదిలీ కాబడితే ఆ ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









