క్రిమియన్-కాంగో జ్వరం ముగ్గురు మృతి ఒమాన్ లో ప్రబలుతున్న చిక్కులు
- March 20, 2017
మస్కట్:ఒమాన్ లో చాప కింద నీరు మాదిరిగా ఓ ప్రాణాంతక వ్యాధి కబళిస్తుంది. క్రిమియన్-కాంగో రక్తస్రావంతో కూడిన జ్వరం కారణంగా ముగ్గురు వ్యక్తులు ఇటీవల మరణించగా మరో ఆరుగురు 2017 మొదటి నెలల నుంచి ఆ (సి సి హెచ్ ఎఫ్) చికిత్స చేయించేందుకు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం క్రిమియన్-కాంగో జ్వరం కారణంగా సంభవించిన మరణాల రేటు ప్రస్తుతం 37.5 శాతంగా నమోదైందని అని పేర్కొన్నారు. సి సి హెచ్ ఎఫ్ పెరుగుదల కాబడిన సందర్భాల్లో 2016 లో ఇదే కాలంలో పోలిస్తే కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి సి సి హెచ్ ఎఫ్ ఇది ఒక టిక్ అనే వైరస్ వలన కలిగే వ్యాధి. ఆవులు, మేకలు మరియు గొర్రెలు తదితర జంతువుల ప్రభావితంగా మానవులకు సంక్రమించే ఓకే వ్యాధి. టిక్ జీవిగా పేరొందిన ఆ ప్రాణి నేరుగా మనిషిని కుట్టడం ద్వారా శరీరంలోని రక్తం లోనికి ప్రవేశిస్తుంది. లేదా ఆ జంతువుని వదించే సమయంలో వ్యక్తికి ఆ జబ్బు సోకిన జంతువుల ' రక్తం లేదా అవయవాలలో దాగి ఉన్న ఆ జీవి మాంసం నరికే వ్యకిని కుట్టి అతని శరీరంలోనికి ప్రవేశిస్తాయి. దాంతో క్రిమియన్-కాంగో రక్తస్రావంతో కూడిన జ్వరం రావడం క్రమేపి ఆ వ్యక్తి మరణించడం జరుగుతుంది.ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం మరొక మార్గం ఏమిటంటే, ఆ జబ్బు సోకిన వ్యక్తికి చెందిన రక్తం లేదా ఇతర శరీర ద్రవాలు మరొక వ్యక్తి బదిలీ కాబడితే ఆ ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







