సౌదీ అరేబియాలో బంధీలైన 29 మందిని విడపించమంటూ సుష్మాకు కేటీఆర్ లేఖ

- March 21, 2017 , by Maagulf
సౌదీ అరేబియాలో బంధీలైన  29 మందిని విడపించమంటూ సుష్మాకు కేటీఆర్ లేఖ

సౌదీ అరేబియాలోని అల్‌హసాలో ఉన్ అల్ హజారీ ఓవర్‌సీస్ కంపెనీలో పని చేస్తున్ 29 మంది తెలంగాణ రాష్ట్ర వాసులను ఆ కంపెనీ గత 12 రోజులుగా నిర్భంధించిందని పురపాలక, ఐటీ, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కె. తారకరామారావు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకువెళ్ళారు.  వీరందరిని విడిపించి వారి వారి స్వస్థలాలకు తిరిగి తీసుకు వచ్చే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవానలి కేటీఆర్ కేంద్రమంత్రికి సోమవారం లేఖ రాశారు.  సౌదీ కంపెనీలో పని చేస్తున్న వీరంతా తమ స్వగ్రామాలకు వెళ్ళిపోతామని వేడుకున్నా  వినకుండా వారిని కంపెనీ యాజమాన్యం ఒక గదిలో బంధించి ఉంచిదని తెలిపారు.  భోజనం,నీరు,మందులు ఇవ్వకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా 12 రోజులుగా చిత్ర హింసలు పెడుతున్నారని తెలిపారు.  సౌదీ నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన బోరగళ్ళ శేఖర్ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని తమకు తెలియజేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com