సౌదీ అరేబియాలో బంధీలైన 29 మందిని విడపించమంటూ సుష్మాకు కేటీఆర్ లేఖ
- March 21, 2017
సౌదీ అరేబియాలోని అల్హసాలో ఉన్ అల్ హజారీ ఓవర్సీస్ కంపెనీలో పని చేస్తున్ 29 మంది తెలంగాణ రాష్ట్ర వాసులను ఆ కంపెనీ గత 12 రోజులుగా నిర్భంధించిందని పురపాలక, ఐటీ, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కె. తారకరామారావు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకువెళ్ళారు. వీరందరిని విడిపించి వారి వారి స్వస్థలాలకు తిరిగి తీసుకు వచ్చే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవానలి కేటీఆర్ కేంద్రమంత్రికి సోమవారం లేఖ రాశారు. సౌదీ కంపెనీలో పని చేస్తున్న వీరంతా తమ స్వగ్రామాలకు వెళ్ళిపోతామని వేడుకున్నా వినకుండా వారిని కంపెనీ యాజమాన్యం ఒక గదిలో బంధించి ఉంచిదని తెలిపారు. భోజనం,నీరు,మందులు ఇవ్వకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా 12 రోజులుగా చిత్ర హింసలు పెడుతున్నారని తెలిపారు. సౌదీ నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన బోరగళ్ళ శేఖర్ ఫోన్ ద్వారా ఈ సమాచారాన్ని తమకు తెలియజేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..
- RBI: ప్రభుత్వ ఖాతాలోకి లక్షల కోట్లు..సామాన్యులకు పన్ను ఊరట?
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!







