కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- January 28, 2026
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ జరిమానాలను వెంటనే చెల్లించాలని స్కామ్ టెక్స్ట్ మెసేజులపై జాగ్రత్తగా ఉండాలని భద్రతా అధికారులు హెచ్చరించారు. వెంటనే జరిమానాలు చెల్లించకపోతే జరిమానాలు KD 20 నుండి KD 200 వరకు పెరుగుతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. లింక్ క్లిక్ చేయగానే బ్యాంకు డబ్బు మరియు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారని, ఇలాంటి ఫేక్ లింక్లను క్లిక్ చేయొద్దని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి అంతర్గత మంత్రిత్వ శాఖ SMS లను పంపదని క్లారిటీ ఇచ్చారు. అన్ని విచారణలు మరియు చెల్లింపులు ప్రభుత్వ సాహిల్ అప్లికేషన్ లేదా అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే జరుగుతాయని తెలిపారు. అనుమానాస్పద మెసేజులు వస్తే వెంటనే అధికారులకు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







