కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- January 28, 2026
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ జరిమానాలను వెంటనే చెల్లించాలని స్కామ్ టెక్స్ట్ మెసేజులపై జాగ్రత్తగా ఉండాలని భద్రతా అధికారులు హెచ్చరించారు. వెంటనే జరిమానాలు చెల్లించకపోతే జరిమానాలు KD 20 నుండి KD 200 వరకు పెరుగుతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. లింక్ క్లిక్ చేయగానే బ్యాంకు డబ్బు మరియు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారని, ఇలాంటి ఫేక్ లింక్లను క్లిక్ చేయొద్దని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి అంతర్గత మంత్రిత్వ శాఖ SMS లను పంపదని క్లారిటీ ఇచ్చారు. అన్ని విచారణలు మరియు చెల్లింపులు ప్రభుత్వ సాహిల్ అప్లికేషన్ లేదా అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే జరుగుతాయని తెలిపారు. అనుమానాస్పద మెసేజులు వస్తే వెంటనే అధికారులకు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









