కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- January 28, 2026
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ జరిమానాలను వెంటనే చెల్లించాలని స్కామ్ టెక్స్ట్ మెసేజులపై జాగ్రత్తగా ఉండాలని భద్రతా అధికారులు హెచ్చరించారు. వెంటనే జరిమానాలు చెల్లించకపోతే జరిమానాలు KD 20 నుండి KD 200 వరకు పెరుగుతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. లింక్ క్లిక్ చేయగానే బ్యాంకు డబ్బు మరియు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారని, ఇలాంటి ఫేక్ లింక్లను క్లిక్ చేయొద్దని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి అంతర్గత మంత్రిత్వ శాఖ SMS లను పంపదని క్లారిటీ ఇచ్చారు. అన్ని విచారణలు మరియు చెల్లింపులు ప్రభుత్వ సాహిల్ అప్లికేషన్ లేదా అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే జరుగుతాయని తెలిపారు. అనుమానాస్పద మెసేజులు వస్తే వెంటనే అధికారులకు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









