ఉగ్రవదులుపై అన్ని దేశాలు కలిసి పోరాడాలి: మోడీ
- September 26, 2015
ఉగ్రవాద వ్యతిరేక పోరుపై మోదీ జోర్డాన్, ఈజిప్టు, శ్రీలంక సహా పలువురు దేశాధినేతలతో భేటీ. ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టకుండా వేరు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇస్లామిక్ స్టేట్ వంటి సంస్థలు ప్రేరేపిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమర్థవంతంగా పోరాడాలంటే ప్రపంచ స్థాయి ప్రతిస్పందన అవసరమని ఉద్ఘాటించారు. శుక్రవారం ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లాతో సమావేశమై చర్చలు జరిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ప్రపంచం ఒకే గొంతుతో మాట్లాడాల్సిన సమయం.. దీనిపై సమగ్ర ప్రపంచ సదస్సును నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ పేర్కొన్నారు. రాగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసితో మోదీ సమావేశమై సూయజ్ కాల్వ ప్రాజెక్టులో భారత పెట్టుబడులకు అవకాశాలపై చర్చించారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాలతో జరిపిన భేటీలో.. లంక తమిళుల విషయంలో ఐక్యతా ప్రక్రియపై చర్చలు జరిపారు. స్వీడన్ ప్రధాని స్టెఫాన్ లాఫ్వెన్తోనూ మోదీ చర్చలు జరిపారు. శాంతి పరిరక్షణ ఆపరేషన్లలో.. అధిక సంఖ్యలో దళాలను పంపిస్తున్న భారత్ వంటి దేశాలతో సంప్రదింపులు లేకపోవటంపై ఐరాస చీఫ్ బాన్ కి-మూన్తో మోదీ చర్చించారు. ఈ విషయంలో నిర్ణయాలు తీసుకునే విధానంలో మార్పు రావాలన్నారు. మోదీ ప్రారంభించిన సంస్కరణలు.. భారత్ వైపు ప్రపంచం చూసే దృష్టిపై భారీ ప్రభావం చూపాయని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ మోదీతో భేటీలో పేర్కొన్నారు. కాగా, సాన్ జోస్లోని సిలికాన్ వ్యాలీలో టెస్లా మోటార్స్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, ఫేస్బుక్, అడోబ్ తదితర ప్రఖ్యాత కంపెనీల అధినేతలతో మోదీ భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







