మాస్ మహారాజా హిట్ రీమేక్ లో

- March 25, 2017 , by Maagulf
మాస్ మహారాజా హిట్ రీమేక్ లో

రవితేజ మళ్ళీ జోరు పెంచారు. విక్రంసిరి దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమాలతో బిజీగా వున్నారు. ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లక్ష్మణ్ అనే దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నారని టాక్ .
తమిళంలో లక్ష్మణ్ తెరకెక్కించిన 'బోగన్' సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. అరవింద్ స్వామి - జయం రవి ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడు. జయం రవి పోషించిన పాత్రకి గాను రవితేజను ఒప్పించాడని తెలిసింది. అరవింద్ స్వామి పాత్ర కోసం మరో హీరోని అన్వేషించే పనిలో వున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com