వలసదారులైన ఉద్యోగుల్ని తగ్గించేందుకు సన్నాహాలు

- March 25, 2017 , by Maagulf
వలసదారులైన ఉద్యోగుల్ని తగ్గించేందుకు సన్నాహాలు

మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్స్‌, వలసదారులైన ఉద్యోగుల్ని కువైటీలతో రీప్లేస్‌ చేసేందుకు ప్రయత్నాల్ని చేపట్టనుంది. రానున్న ఐదేళ్ళలోనే పూర్తిగా కువైటీలకు అవకాశం కల్పిస్తారు. క్రమక్రమంగా వలసదారుల్ని తొలగించనున్నారు. కువైటీలకు ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా దేశంలో నిరుద్యోగం తగ్గించడానికి శ్రీకారం చుట్టినట్లు మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ విభాగం కూడా 50 శాతం వలసదారులైన ఉద్యోగుల్ని తొలగించి, వారి స్థానంలో కువైటీలకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. వివిధ మంత్రిత్వ శాఖలు ఆయా విభాగాల్లోని వలసదారులకు చెక్‌పెట్టి, కువైటీలకు అవకాశం కల్పించే దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com