ఉగాది కి ప్రారంభం కానున్న రామ్ కొత్త చిత్రం
- March 25, 2017
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. గతేడాది రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్పై విడుదలైన నేను శైలజ ఎంతటి సెన్సేషనల్ హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. నేను శైలజ చిత్రంలో హీరో రామ్ను సరికొత్తగా ప్రెజంట్ చేసిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రంలో సరికొత్త లుక్, బాడీలాంగ్వేజ్తో చూపించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 29న లాంచనంగా ప్రారంభం కానుంది. నేను శైలజ చిత్రాన్ని అద్భుతమైన మ్యూజిక్ను అందించిన రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తుండగా సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ ఎ.ఎస్.ప్రకాష్ అందిస్తున్నారు. ఈ కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానుందని నిర్మాతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!









