31 లోగా ఆస్తులు వెల్లడించకపోతే కఠిన చర్యలు
- March 25, 2017
నల్లకుబేరులు స్వచ్ఛందంగా తమ ఆస్తులు వెల్లడించాలని, లేకపోతే చింతించక తప్పదని ఐటీ శాఖ హెచ్చరించింది. పీఎంజీకేవై పథకం కింద ఆస్తులు వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఐటీ శాఖ హామీ ఇచ్చింది. ఆదాయాన్ని వెల్లడించని డిఫాల్టర్ల పేర్లను ఈడీ,సీబీఐ వంటి జాతీయ సంస్థలకు తెలియజేస్తామని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. డిఫాల్టర్లపై బినామీ లావాదేవీల చట్టం కూడా ప్రయోగిస్తామని ఆయన చెప్పారు. ఆదాయాన్ని వెల్లడించకుండా ఆధారాలు లేని డబ్బుతో దొరికిపోయిన వారికి 83.25 శాతం పన్ను విధిస్తామని, అధికారులు తనిఖీలు చేసి ఆధారాలు లేని ఆదాయాన్ని కనుగొంటే 107.25 శాతం పన్నుతో పాటు జరిమానా విధిస్తామని తెలిపారు. అధికారుల తనిఖీలలో కూడా ఆదాయాన్ని బహిర్గతం చేనివారికి జరిమానాతోపాటు 137.25 శాతం పన్ను విధిస్తామని చెప్పారు. ఒకవేళ ఉల్లంఘనలపై బినామీ చట్టాన్ని ప్రయోగిస్తే వారికి ఏడేండ్ల కఠిన కారాగారశిక్షతో పాటు ఐటీ చట్టం కింద ఆరోపణలు మోపే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









