తెలుగు తరంగిణి ఉగాది ఉత్సవాలకు ఆహ్వానం
- March 26, 2017
తెలుగు తరంగిణి కుటుంబ సభ్యులకు శతకోటి వందనాలు.
అందరూ ఆసక్తికరంగా ఎదురు చూసే ఉగాది ఉత్సవాలు మీ అందరి అభిలాష మేరకు 31 మార్చ్ 2017 శుక్రవారం రోజు రస్ అల్ ఖైమా లోని బిట్స్ కాంపస్ లో నిర్వహించుటకు నిర్ణయించబడినది. ఈ కార్యక్రమం ఉదయం 9:00 లకు మొదలు అయి సాయంత్రం 5:00 ల వరకు కొనసాగుతుంది.
ఆహ్లాదకరమైన వాతావరణంలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, కుటుంబ వినోద కార్యక్రమాలు, విందు భోజనాలు మరియు ఆట పాటలతొ ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కలిసి ఆనందించే ఉగాది ఉత్సవాలకు అందరికి తెలుగు తరంగిణి తరఫున హ్రుదయపూర్వక ఆహ్వానం .
ప్రముఖ తెలుగు ప్లేబాక్ సింగర్స్ డా. అరుణ్ కౌండిన్య (బోల్ బేబి బోల్, మెంటల్ పోలీస్, విన్నర్ ఫేం) మరియు కుమారి సత్య యామిని (బాహుబలి, సోగ్గాడే చిన్ని నాయన ఫేం) వారి పాటలతో మనల్ని ఉర్రూతలూగించేందుకు వస్తున్నారు. ఇంకా మన రస్ అల్ ఖైమా మరియు ఇతర ఎమిరేట్ల నుంచి బాల బాలికలు తమ సంప్రదాయ మరియు సినిమా నృత్యాలతో మనల్ని వారితో కలిపి చిందు వేయించడానికి సిద్ధం అవుతున్నారు.
మరి ఇంకా ఎందుకు ఆలస్యం? అన్ని పనులు పక్కన పెట్టి శుక్రవారం అందరం కలిసి మీ బంధు మిత్ర సపరివార సమేతంగా ఉగాది పండుగ జరుపుకోవడానికి తరలిరండి.
ఇప్పుడు మన కార్యక్రమాలను Youtube ఛానల్ ద్వారా చూడవచ్చు. తాజా వీడియోలకోసం దయచేసి తెలుగు తరంగిణి Youtube ఛానెల్ సభ్యత్వానికి నమోదు చేసుకోండి. తాజా సమాచారం కొరకు తెలుగుతరంగిణి.కాం, తెలుగు తరంగిణి ఫేస్బుక్ పేజీలను తరచు చూడండి.
మీ ఆత్మీయ ఆగమనాభిలాషులు,
తెలుగు తరంగిణి పాలక సభ్యులు
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







