సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకోనున్న మహేష్ బాబు
- September 28, 2015
తెలంగాణ రాష్ట్రంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సినీనటుడు మహేశ్బాబు ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోనున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడాక ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మహేశ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.గ్రామాల దత్తత నేపథ్యంగా మహేశ్ నటించిన 'శ్రీమంతుడు' చిత్రం ఇటీవలే విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. గ్రామాన్ని దత్తత తీసుకునే అంశాన్ని కమర్షియల్ పాయింట్ తీసుకుని తెరకెక్కించిన విధానం అందరికి బాగా నచ్చింది. ఈ చిత్రం ఎందరో ప్రముఖులను కదిలించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ శ్రీమంత్రుడు చిత్రాన్ని చూసి మహేశ్బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు.గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన మహేశ్బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్కు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







