కార్మికుల సమస్యల్ని తెలుసుకుంటం: భారత దౌత్యాధికారి
- September 28, 2015
భారత దౌత్యాధికారి ఇంద్ర మణి పాండే, ఒమన్లోని భారతీయ పౌరులు, కార్మికుల అభ్యున్నతి కోసం కృషి చేస్తామన్నారు. ఇండియా నుంచి ఒమన్కి చవకైనా విమాన ప్రయాణం కోసం, ఇంకా మెరుగైన విమాన సౌకర్యాల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. మణి పాండే. ఫలాజ్లోని జిందాల్ షాదీద్ హాల్లో జరిగిన ఇండియన్ సోషల్ క్లబ్ సోహార్ సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ఒమన్ అభివృద్ధిలో భారతీయుల పాత్రను ఆయన కొనియాడారు. సోహార్ పర్యటించడం ఆయనకు ఇదే తొలిసారి. సభ్యులు ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. ఇండియన్ సోషల్ క్లబ్ సోహార్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ టాండన్, మణి పాండేకు శుభాకాంక్షలు తెలిపారు. ఒమన్, ఇండియా మధ్య సత్సంబంధాల మెరుగుకు మణి పాండే తనవంతు సహాకారం అందిస్తారని భావిస్తున్నట్లు రాజీవ్ టాండన్ చెప్పారు. అనంతరం లార్సన్ అండ్ టుబ్రో హెవీ ఇంజనీరింగ్ కంపెనీని కూడా మణి పాండే సందర్శించారు. కార్మికులతో కలిసి ఇండియన్ సోషల్ క్లబ్ సోహార్ లంచ్ చేపట్టింది. తన పర్యటనకు గుర్తింపుగా రాయబారి మణి పాండే ఆ ప్రాంతంలో ఓ మొక్కను నాటారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







