ఖతార్ ఎయిర్వేస్ కన్ను భారత గగనతలంపై
- March 28, 2017ఎయిర్లైన్స్ ఏర్పాటుకు 100 విమానాల కొనుగోలు
న్యూఢిల్లీ: భారత విమానయాన రంగంలోకి అడుగుపెట్టేందుకు ఖతార్ ఎయిర్లైన్స్ సన్నాహాలు చేస్తోం ది. భవిష్యత దృష్టి ఉన్న ప్రధాని మోదీ త్వరలోనే భారతలో 100 శాతం విదేశీ పెట్టుబడులతో ఎయిర్లైన్స్ సంస్థలను ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలను అనుమతించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు ఖతార్ ఎయిర్వేస్ సిఇఒ అక్బర్ అల్ బకర్ చెప్పారు. భారతలో అవకాశాలను దృష్టిలో ఉంచుకొని 100 కొత్త జెట్లైనర్స్ కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చే విషయం పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆఖరులోగానే ఖతార్ ఎయిర్వేస్ ఈ భారీ ఆర్డర్ను ఇచ్చే అవకాశం ఉందని అల్బకర్ వెల్లడించారు.
దేశీయ విమానయాన రంగంపై ఇటీవల కాలంలో విదేశీ సంస్థల ఆసక్తి బాగా పెరిగింది. అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ కొంతకాలం క్రితం జెట్ ఎయిర్వేస్ ఇండియాలో 24 శాతం వాటా తీసుకొంది. సింగపూర్ ఎయిర్లైన్స్ మలేషియాకు చెందిన ఎయిర్ ఆసియా రెండూ టాటాలతో కలిసి జాయింట్ వెంచర్లో ఎయిర్లైన్స్ను ప్రారంభించాయి. ఈ రెండు సంస్థలకు భారత అనుబంధ సంస్థలో 49 శాతం చొప్పున వాటా ఉంది.
ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో పెట్టుబడులకు సంబంధించి విదేశీ ఎయిర్లైన్స్ సంస్థలకు పరిమితులు విధించారు. విదేశీ ఎయిర్లైన్స్ సంస్థలకు దేశీయ కంపెనీల్లో 49 శాతం కంటే మించి వాటా ఉండటానికి వీల్లేదు. విమానయాన రంగం కాకుండా ఇతర రంగాల్లోని విదేశీ సంస్థలు మాత్రం 100 శాతం పెట్టుబడి పెట్టే వెసులుబాటునిచ్చారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్