సౌదీలో క్షమాభిక్ష కార్యక్రమంలో పాల్గొన్న APNRT కో-ఆర్డినేటర్స్
- March 29, 2017
తమ దేశ వీసా నిబంధనలను ఉల్లంఘించి పని చేస్తున్న విదేశీయులు ఏలాంటి జరిమానా లేదా జైలు శిక్ష లేకుండా స్వచ్ఛంధంగా స్వదేశాలకు తిరిగి వెళ్ళే క్షమాభిక్ష కార్యక్రమాన్ని సౌదీఅరేబియా ప్రారంభించింది. ప్రభుత్వం ప్రకటించిన 3 నెలలకు బుధవారం నుంచి ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది. మొదటిరోజు వేలాది మంది తెలుగు ప్రవాసీయులు ధరఖాస్తు చేసుకున్నారు.
స్వస్థలానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్న తెలుగు ప్రవాసీయులు ఎవరి వద్ద కూడా పాస్పోర్టులు లేకపోవడంతో రియాధ్, జెద్ధాలలోని భారతీయ దౌత్య కార్యాలయాలు వీరికి తాత్కలిక పాస్పోర్టులను జారీ చేస్తున్నాయి. ఈ మేరకు సుదూర ఎడారి ప్రాంతాలలో కూడా భారతీయ దౌత్య బృందాలు పర్యటించి దరఖాస్తుదారులకు ప్రయాణ పత్రాలను జారీ చేస్తున్నాయి. భారత్కు వెళ్ళేవారి కోసం తాము 24 గంటలు సేవలందిస్తామని భారతీయ కాన్సల్ జనరల్ నూర్ రహేమాన్ షేక్ చెప్పారు. భారతీయ అధికారులు జారీ చేసిన పాస్పోర్టులను సౌదీ ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందజేయడంతోపాటు వేలి ముద్రలను సమర్పించిన తర్వాత దేశం విడిచి వెళ్ళడానికి సౌదీ అధికారులు అనుమతిస్తారు.
మొదటి రోజు రియాధ్ నగరంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారని ఎపి ఎన్నార్టీ ప్రతినిధి, ప్రముఖ సామాజిక కార్యకర్త అంథోని రేవల్ చెప్పారు. స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్న తెలుగువారందరికి తాము వీలైన విధంగా సహాయం చేస్తామని దమ్మాంలోని ఎపి ఎన్నార్టీ ముఖ్య ప్రతినిధి రావి రాధకృష్ణా, జెద్ధా తెలుగు సంఘం అధ్యక్షుడు మోహమ్మద్ యూసుఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









