ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ని ప్రారంభించిన మవసలాత్
- March 29, 2017
మస్కట్:ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, ఒమన్టెల్తో కలిసి సంయుక్తంగా, ప్రయాణీకులకు ఉచిత అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందించనుంది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని పలు ఇంటర్నల్ రూట్స్లో ఈ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఇతర గవర్నరేట్స్కి వెళ్ళే ఎక్సటర్నల్ రూట్స్లోనూ, సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ బస్ ఫ్లీట్లోనూ ఇంటర్నెట్ సర్వీసుల్ని ఉచితంగా అందిస్తున్నట్లు మవసలాత్ ప్రతినిథులు తెలిపారు. డిసెంబర్ 2016లో మవసలాత్, ఒమన్టెల్ ఉచిత వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మవసలాత్ బస్సుల్ని మరింతగా ప్యాసింజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకోసం ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఒమన్టెల్, ఓరెండూ, రెన్నా తదితర ఆపరేటర్ల సహకారంతో ప్రయాణీకులకు ఉచిత ఇంటర్నెట్ సర్వీసుల్ని మవసలాత్ అందిస్తోంది.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







