ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ని ప్రారంభించిన మవసలాత్
- March 29, 2017
మస్కట్:ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, ఒమన్టెల్తో కలిసి సంయుక్తంగా, ప్రయాణీకులకు ఉచిత అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందించనుంది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని పలు ఇంటర్నల్ రూట్స్లో ఈ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఇతర గవర్నరేట్స్కి వెళ్ళే ఎక్సటర్నల్ రూట్స్లోనూ, సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ బస్ ఫ్లీట్లోనూ ఇంటర్నెట్ సర్వీసుల్ని ఉచితంగా అందిస్తున్నట్లు మవసలాత్ ప్రతినిథులు తెలిపారు. డిసెంబర్ 2016లో మవసలాత్, ఒమన్టెల్ ఉచిత వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మవసలాత్ బస్సుల్ని మరింతగా ప్యాసింజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకోసం ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఒమన్టెల్, ఓరెండూ, రెన్నా తదితర ఆపరేటర్ల సహకారంతో ప్రయాణీకులకు ఉచిత ఇంటర్నెట్ సర్వీసుల్ని మవసలాత్ అందిస్తోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







