మలుపు తిరుగుతూ భారీ ట్రక్కు బోల్తా... ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం
- March 31, 2017
పాలు, పండ్ల రసాలను తీసుకువెళ్ళే ఒక భారీ ట్రక్కు మలుపు తిరుగుతూ బోల్తాపడింది. గురువారం మధ్యాహ్నం దోహా ఇండస్ట్రియల్ ఏరియా రోడ్డుపై బర్వా కమర్షియల్స్ అవెన్యూ సిగ్నల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనితో ఒక విభాగంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. ప్రమాదస్థాలానికి ఒక క్రేన్ ను తీసుకువచ్చి బోల్తాపడిన ట్రక్ ను అక్కడ్నుంచి తొలగించడంతో ట్రాఫిక్ కు అవరోధాలు తొలిగేయి. . సివిల్ డిఫెన్స్ సిబ్బంది ప్రమాద స్థలానికి వచ్చి పండ్ల రసాలు...ఒలికి పోయిన పాలు తదిర వ్యర్ధాలను తొలగించి ఆ ప్రాంతాన్నిశుభ్రం చేశారు. పోలీసు రద్దీ లో చిక్కుకొనిపోయిన వాహనాలను ఆ ప్రాంతం నుంచి మళ్లించారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారో లేదన్నది ఇంకా సమాచారం తెలియరాలేదు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









