గుజరాత్ లో కొత్త చట్టం గోవధకు పాల్పడితే.. ఇక యావజ్జీవ జైలు శిక్షే
- March 31, 2017
గుజరాత్ ప్రభుత్వం గోవధ చట్టాన్ని మరింత కఠినం చేసింది. ఇకనుంచి గోవధకు పాల్పడినా.. గోవులను అక్రమంగా తరలించినా.. యావజ్జీవ ఖైదు పడేలా చట్టాలను సవరించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిసిపోనున్న నేపథ్యంలో ఈమేరకు నేటి ఉదయం గుజరాత్ అసెంబ్లీ 1954నాటి పాత చట్టాన్ని సవరించింది.
సవరించిన యానిమల్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం గోవధ, గోవుల తరలింపులకు పాల్పడినవారికి ఇకనుంచి యావజ్జీవ శిక్ష అమలుకానుంది. చట్ట సవరణలో జరిమానా పరిమితిని కూడా పెంచారు. ఇలాంటి ఉదంతాల్లో ఇంతకుముందు రూ.25వేల జరిమానా విధించగా.. ఇకనుంచి దాన్ని రూ.50వేలకు పెంచుతూ చట్ట సవరణ చేశారు.
ఇటీవల గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దీనిపై పరోక్షంగా స్పందించారు.
'గోవు, గంగ, గీత'రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన ప్రకటించారు. కాగా, గుజరాత్ లో 2011నుంచి గోవధపై, గోవుల తరలింపుపై నిషేధం అమలవుతోంది. ఇప్పుడు ఆ చట్టం మరింత కఠినరూపం తీసుకుంది.
కాగా, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోను బీజేపీ ప్రభుత్వమే ఉండటంతో.. భవిష్యత్తులో అక్కడ కూడా ఇదే తరహా చట్టాలను తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు.
తాజా వార్తలు
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- ఫుట్బాల్ మ్యాచ్లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల..







