రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా ఐదుగురికి గాయాలు
- March 31, 2017
గురువారం షేక్ ఇసా బిన్ సల్మాన్ జాతీయ రహదారిపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 65 ఏళ్ల బహ్రేయినీ వృద్ధురాలు మరణించింది. మరో ఐదుగురు వ్యక్తులు ఆ ప్రమాదంలో గాయపడ్డారు.నివేదికల ప్రకారం, ఒక ఆసియా వ్యక్తి నడుపబడుతున్న సౌదీ నుంచి ప్రయాణిస్తున్న ఒక ట్రక్ అకస్మాత్హుగా రోడ్డుపై నియంత్రణ కోల్పోయింది. ఎంతో రద్దీగా ఉండే అల్ జాంబియా వంతెనపై ఉన్నప్పుడు ఇతర వాహనాలపైకి దూసుకుపోయింది అధికమైన వేగం మరియు డ్రైవింగ్ పై సరిగా దృష్టిని నిలపకపోవడం వలన ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని నివేదికల పేర్కొంటున్నాయి. ఒక ఎస్ యు వి వాహనంలో ముగ్గురు బహ్రయినీయులు ప్రయాణిస్తున్నారు.ఇంతలో అకస్మాత్తుగా వెనుక నుంచి ట్రక్ వీరి వాహనంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఎస్ యు వి వాహనంలో వెనుక కూర్చొన్న వృద్ధురాలు అక్కడక్కడే మరణించిందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే ట్రక్కు ఐదుగురు ఆసియా ప్రయాణికుల సమూహంని తీసుకుని వెళుతున్నమరో పికప్ వ్యాన్ ను డీ కొట్టింది .అందులో ప్రయాణిస్తున్నవారు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సలమియా మెడికల్ కాంప్లెక్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ జట్లు వెంటనే ప్రమాద స్ధలానికి వచ్చారు. తొలగింపు కార్యకలాపాలు చేపట్టారు ట్రక్ సహా వాహనాలు క్రేన్లు సహాయంతో ప్రమాద స్థలం నుండి తొలగించారు.ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ఈ ప్రమాద కారణం నిర్ధారించడానికి పరిశోధనలు ప్రారంభించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







