పరాచినార్‌ లో బాంబు పేలుడు, 24 మంది మృతి

- March 31, 2017 , by Maagulf
పరాచినార్‌ లో బాంబు పేలుడు, 24 మంది మృతి

పాకిస్థాన్‌లో శుక్రవారం బాంబుపేలుడు సంభవించింది. పరాచినార్‌ అనే గిరిజన ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 90 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సహాయక సిబ్బంది, పోలీసులు క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జనవరిలో ఇదే ప్రాంతంలోని కూరగాయల మార్కెట్‌లో పేలుడు సంభవించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com