హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వివేక్
- March 31, 2017
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) నూతన అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్ ఎన్నికయ్యారు. పాలకవర్గం కోసం జనవరి 17న ఎన్నికలు నిర్వహించారు. దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో అనిశ్చితి నెలకొంది. తాజాగా ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని ఉమ్మడి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో శుక్రవారం ఓట్లను లెక్కించారు. అధ్యక్ష పదవికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేకానంద్, మాజీ ఆటగాడు విద్యుత్ జయసింహ పోటీపడ్డారు. అయితే విద్యుత్ జయసింహపై 68 ఓట్ల తేడాతో వివేక్ గెలుపొందారు. మొత్తం ఓట్లలో వివేక్కు 136, జయసింహకు 68 ఓట్లు దక్కాయి. అన్ని స్థానాల్లోనూ వివేక్ ప్యానెల్ గెలుపొందింది. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. హెచ్సీఏకు పూర్వవైభవం తీసుకొస్తానని మాటిచ్చారు. లోధా కమిటి సిఫార్సుల మేరకే ఎన్నికలు జరిగినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







