హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన వివేక్
- March 31, 2017
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) నూతన అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్ ఎన్నికయ్యారు. పాలకవర్గం కోసం జనవరి 17న ఎన్నికలు నిర్వహించారు. దీనిపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో అనిశ్చితి నెలకొంది. తాజాగా ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని ఉమ్మడి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో శుక్రవారం ఓట్లను లెక్కించారు. అధ్యక్ష పదవికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేకానంద్, మాజీ ఆటగాడు విద్యుత్ జయసింహ పోటీపడ్డారు. అయితే విద్యుత్ జయసింహపై 68 ఓట్ల తేడాతో వివేక్ గెలుపొందారు. మొత్తం ఓట్లలో వివేక్కు 136, జయసింహకు 68 ఓట్లు దక్కాయి. అన్ని స్థానాల్లోనూ వివేక్ ప్యానెల్ గెలుపొందింది. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. హెచ్సీఏకు పూర్వవైభవం తీసుకొస్తానని మాటిచ్చారు. లోధా కమిటి సిఫార్సుల మేరకే ఎన్నికలు జరిగినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..
- RBI: ప్రభుత్వ ఖాతాలోకి లక్షల కోట్లు..సామాన్యులకు పన్ను ఊరట?
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు







