సానియా జోడీ మియామి ఓపెన్ ఫైనల్లో
- March 31, 2017
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మియామి ఓపెన్ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా-స్ట్రికోవా జోడీ 6(6)-7(8), 6-1, 10-4తో మార్టినా హింగిస్-చాన్ జంటను ఓడించింది.
హోరాహోరీగా సాగిన తొలి సెట్ను హింగీస్ జోడీ కైవసం చేసుకుంది. తర్వాత పుంజుకున్న సానియా జోడీ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వెంట వెంటనే పాయింట్లు సాధించి 6-1తో రెండో సెట్ను సునాయాసంగా గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరికి 10-4తో సానియా జోడి సెట్ను గెలుచుకుని ఫైనల్కు దూసుకెళ్లింది. సానియా జోడీ ఫైనల్లో గాబ్రియల్(కెనడా)-వై.చు(చైనా)తో తలపడనుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!









