సానియా జోడీ మియామి ఓపెన్ ఫైనల్లో
- March 31, 2017
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మియామి ఓపెన్ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా-స్ట్రికోవా జోడీ 6(6)-7(8), 6-1, 10-4తో మార్టినా హింగిస్-చాన్ జంటను ఓడించింది.
హోరాహోరీగా సాగిన తొలి సెట్ను హింగీస్ జోడీ కైవసం చేసుకుంది. తర్వాత పుంజుకున్న సానియా జోడీ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వెంట వెంటనే పాయింట్లు సాధించి 6-1తో రెండో సెట్ను సునాయాసంగా గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరికి 10-4తో సానియా జోడి సెట్ను గెలుచుకుని ఫైనల్కు దూసుకెళ్లింది. సానియా జోడీ ఫైనల్లో గాబ్రియల్(కెనడా)-వై.చు(చైనా)తో తలపడనుంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







