బహరేన్ లో గుండెపోటుతో మరణించిన భారతీయ ప్రవాసీయుడు
- April 01, 2017
బహరేన్ లో ఓ ప్రవాసీయ భారతీయుడు గుండెపోటుతో మరణించారు. కేరళా రాష్ట్రానికి చెందిన థామస్ జాన్ (56) బటెల్కో సంస్థలో కొన్నాళ్ళు పాటు సేవలు అందించిన తర్వాత ఆయన స్వంతంగా ఖవాజా నియాజ్ నిర్మాణ కంపెనీని ప్రారంభించారు. దీనిని ఆయన గత 35 సంవత్సరాలుగా ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. థామస్ జాన్ కు భార్య రాచెల్ థామస్ మరియు ముగ్గురు కుమార్తెలు జేసింత్ థామస్, జస్సం థామస్ మరియు జానా థామస్ ఉన్నారు. థామస్ జాన్ పార్ధీవ దేహాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో మృతదేహాలను భద్రపరిచే ప్రదేశములో భద్రపర్చబడింది. సుగాయ లోని న్యూటెస్టమెంట్ చర్చి వద్ద (నేడు) ఏప్రిల్ 1 వ తేదీ శనివారం సాయంత్రం 3 గంటలు 4 గంటల మధ్య ప్రార్ధనల అనంతరం ఆయనకు కడసారిగా నివాళులు అర్పించిన తర్వాత ఏప్రిల్ 3 వ తేదీ సోమవారం కేరళ లోని ఆయన స్వస్థలమైన కరునాగప్పల్లికు ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్ళతారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







