కేరళ వలస కార్మికులకు ఆరోగ్య భీమా తప్పనిసరి
- September 28, 2015
కేరళ నుంచి విదేశాలకు వెళ్ళాలనుకునేవారికి ఆరోగ్య భీమా తప్పనిసరి కానుంది. ఇందుకోసం కేరళ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భారతదేశం నుంచి అధికారికంగా ఇప్పటివరకు ఇలాంటి 'తప్పనిసరి' నిబంధన లేదు. కేరళ ప్రభుత్వం ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తే, దేశంలోనే తొలి రాష్ట్రంగా ఈ విభాగంలో కేరళ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. విదేశాల్లో ఉంటున్న కార్మికులు ఈ అంశంపై చర్చిస్తున్నారు. కేరళ ప్రభుత్వం కూడా వారితో చర్చలు జరుపుతోంది. భీమా ప్రీమియం ఎలా ఉండాలి? ఎంతవరకు అది అత్యవసరం? అనే అంశాలను చర్చిస్తున్నట్లు నాన్ రెసిడెంట్ కేరళైట్స్ డిపార్ట్మెంట్ (నోర్కా) సెక్రెటరీ రాణి జార్జ్ చెప్పారు. ఫిలిప్పీన్ దేశంలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి నిబంధన అమల్లో ఉంది. 2014 అంచనాల ప్రకారం 2.3 మిలియన్ రేరళీయులు విదేశాల్లో ఉంటున్నారు. వారిలో ఎక్కువమంది గల్ప్ దేశాల్లోనే ఉపాధి పొందుతున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







