బహ్రెయిన్ లో జీసీసీ నివాసితులు ఐడి కార్డులు పొందాలి
- April 02, 2017
మనామా:త్వరలో కింగ్డమ్ లో వివిధ ప్రభుత్వ విభాగాలలో అవాంతరం కలగకుండా ఉండేందుకు ఉచిత సేవలను సులభతరం చేసే నిమిత్తం బహ్రేయినీ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు సమాచార మరియు ఈ గవర్నమెంట్ అథారిటీ (ఐ జి ఏ) తెలిపింది. ఈ విధానం ద్వారా బహరేన్ లో ఉన్న జీసీసీ నివాసితులు మరియు పెట్టుబడిదారులు ఎక్కువ సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి ఉప ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సూచించిన నిర్దేశకాలను అనుసరించనున్నారు. ఈ గవర్నమెంట్ అథారిటీ (ఐ జి ఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ ఆలీ అలఖ్ఎడ్ శనివారం ఈ సమాచారం ప్రకటించారు. ఈ చొరవ ద్వారా దేశంలో వివిధ లావాదేవీలను నిర్వహించడం కోసం ఒక ఏకీకృత గుర్తింపు రుజువు చేసేందుకు ఈ గుర్తింపు కార్డు ఉపయోగించడం గురించి రాయల్ డిక్రీ సంఖ్య 2 తో 2013 లో పొందుపర్చారు. ప్రతి జీసీసీ నివాసి లేదా పెట్టుబడిదారు (దీని రెసిడెన్సీ కింగ్డమ్ లోనికి ప్రవేశించిన తేదీ నుండి మునుపటి సంవత్సరంలో ఆరు నెలల క్రితం ) మరియు ఒక ప్రామాణిక, అధికారికంగా గుర్తింపు చిరునామా కల్గి ఉండటానికి స్వంత గుర్తింపు కల్గిఉండాలి ఈ గుర్తింపుకార్డు ద్వారా అత్యంత భద్రత, గోప్యత మరియు సేవలలో నాణ్యత అత్యధిక స్థాయిలో అందిస్తుందని ఆలీ అలఖ్ఎడ్ చెప్పారు. ఈ గవర్నమెంట్ విధానంతో జాతీయ వ్యూహాన్ని అవలంబించడమే కాక పౌరులు మరియు నివాసితులు ప్రయోజనం పొందుకొనేలా ఆన్లైన్ లో లావాదేవీలు అనుకూలంగా ఉంటుంది. ఇది చట్టం సంఖ్య46 యొక్క ఆర్టికల్ 2006 (ఐ డ్ కార్డు సంబంధించి) సమగ్రవిధానం ద్వారా అమలుజరగనుంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







