ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత తెలుగు తేజం
- April 02, 2017
తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన సింధు ఇప్పుడు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో విజేతగా నిలిచింది. టాప్ సీడ్ స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్తో జరిగిన హోరాహోరీ పోరులో రెండు వరుస గేమ్ల్లో 21-19, 21-16తో విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో రియో ఒలింపిక్స్ ఫైనల్లో జరిగిన పరాభవానికి కరోలినాపై సింధు మరోసారి ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది. రియో ఒలింపిక్స్ అనంతరం డిసెంబర్ 2016లో జరిగిన దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్లో మారిన్పై సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే.
హోరాహోరీగా సాగిన తొలి గేమ్లో ఒకానొక దశలో ఇరువురి మధ్య 16-16, 18-18, 19-19 పాయింట్లతో నువ్వానేనా అన్నట్లు పోరు సాగింది. అద్భుత ప్రదర్శనతో సింధు ఆ గేమ్ను 21-19తో ముగించింది. ఉత్కంఠగా సాగిన రెండో గేమ్లో సింధు ఆది నుంచి మారిన్పై పైచేయి సాధిస్తూ వచ్చింది. అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ 21-16 పాయింట్లతో రెండో గేమ్తోపాటు సిరీస్ను కైవసం చేసుకుంది.
ఈ విజయంతో సింధు కెరీర్లో రెండో సూపర్ సిరీస్ టైటిల్ దక్కించుకుంది.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..







