రష్యాలో మెట్రో రైల్లో పేలుడు,10 మంది మృతి
- April 03, 2017
రష్యాలో మెట్రో రైల్లో భారీ పేలుడు జరిగింది. సెయింట్ పీటర్స్ బర్గ్లో ఒక మెట్రో రైలు బోగీ బాంబు పేలుడుతో ధ్వంసమైంది. ఈ పేలుడులో పది మంది మృతి చెందినట్లు, 15 మంది గాయపడ్డట్టు అధికారులు ప్రకటించారు. స్థానిక మీడియా మాత్రం పది మంది వరకూ మరణించారని.. చాలా మంది గాయపడ్డారని పేర్కొంది.
మెట్రో రైల్లో పేలుడుతో మూడు మెట్రో స్టేషన్లు మూసివేశారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా పొగలు అలుముకున్నాయి.. జనం భయంతో పరుగులు తీశారు. పేలుడుకు కారణమేంటనేది అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఇది ఉగ్రదాడి అయ్యుంటుందని అనుమానిస్తున్నారు. రైలు బోగీ పేలుడులో ఛిద్రమవడంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







