రష్యాలో మెట్రో రైల్లో పేలుడు,10 మంది మృతి
- April 03, 2017
రష్యాలో మెట్రో రైల్లో భారీ పేలుడు జరిగింది. సెయింట్ పీటర్స్ బర్గ్లో ఒక మెట్రో రైలు బోగీ బాంబు పేలుడుతో ధ్వంసమైంది. ఈ పేలుడులో పది మంది మృతి చెందినట్లు, 15 మంది గాయపడ్డట్టు అధికారులు ప్రకటించారు. స్థానిక మీడియా మాత్రం పది మంది వరకూ మరణించారని.. చాలా మంది గాయపడ్డారని పేర్కొంది.
మెట్రో రైల్లో పేలుడుతో మూడు మెట్రో స్టేషన్లు మూసివేశారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా పొగలు అలుముకున్నాయి.. జనం భయంతో పరుగులు తీశారు. పేలుడుకు కారణమేంటనేది అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఇది ఉగ్రదాడి అయ్యుంటుందని అనుమానిస్తున్నారు. రైలు బోగీ పేలుడులో ఛిద్రమవడంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్







