బొద్దింకలు భోజనంలో రావడంతో రెస్టారెంట్ మూసివేత

- April 03, 2017 , by Maagulf
బొద్దింకలు భోజనంలో రావడంతో రెస్టారెంట్ మూసివేత

మనామా:ప్రజా ఆరోగ్యాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని రాజధాని లో ఒక రెస్టారెంట్ ను అధికారులు ఇటీవల మూసివేశారు. ఈ రెస్టారెంట్లో ఆహార పదార్ధాలపై సంచరించే కీటకాలను సామాజిక మీడియా ఆన్లైన్ లో ఒక వీడియో ఫుటేజ్ ను గమనించిన అనంతరం ఆరోగ్య శాఖ పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ కు చెందిన తనిఖీ బృందాలు ఆకస్మికంగా రెస్టారెంట్ పై దాడి చేసి నిర్వహణ తీరుని పరిశీలించారు. బొద్దింకల ముట్టడితో వంటగదులు మిల మిల లాడుతున్న నేపథ్యంలో ఆ బొద్దింకల రెస్టారెంట్ కు తాళాలు వేశారు. లాక్. ఆహార పర్యవేక్షణ శాఖ హెడ్ మహమ్మద్ అల్ హద్దగ్ సామాజిక మీడియా నెట్వర్క్ లలో  చెలామణి అవుతున్న సమాచారం ఖచ్చితత్వాన్ని పరిశీలన చేసిన తర్వాత అక్కడ జరుగుతున్నది నిజమేనని నిర్ధారించింది. అయితే, రెస్టారెంట్ పేరు అల్ హద్దగ్ వెల్లడించలేదు.ప్రైమరీ కేర్ మరియు పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ అండర్ డాక్టర్ మరియం అల్ హజారీ  యొక్క సూచనలను ప్రకారం, ఆ రెస్టారెంట్ భోజనం చేయడం ప్రమాదం అని పరిశీలించిన తర్వాత  మసివేశారు ఆహార భద్రతకు సంబంధించి అటువంటి ఫిర్యాదులు ఏమైనా ఉంటె,  ప్రజలు మంత్రిత్వశాఖ అధికారిక నెంబర్ 39427743 కు తెలియచేయవచ్చని అయన పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com