‘కసబా’ చిత్రంలో మమ్ముట్టి సరసన మళ్లీ వరలక్ష్మి
- April 06, 2017
తమిళంలో ‘పోడా పోడి’, ‘తారై తప్పట్టె’ చిత్రాల్లో నటించిన వరలక్ష్మి శరత్కుమార్ గత సంవత్సరం ‘కసబా’ చిత్రం ద్వారా మలయాళ చిత్రసీమకు పరిచయమయ్యారు. అందులో మమ్ముట్టి హీరోగా నటించారు. ఈ సంవత్సరం సముద్రగని దర్శకత్వంలోని ‘అప్పా’ తమిళ చిత్రం మలయాళంలో పునర్నిర్మించనుండగా అందులో నటించే అవకాశం వరలక్ష్మికి లభించినా పూజ జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో మలయాళ చిత్రంలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ఈ చిత్రంలోనూ హీరో మమ్ముట్టి కావడం గమనార్హం. మమ్ముట్టితో ‘రాజాధి రాజా’ అనే మలయాళ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజయ్ వాసుదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
‘రాజాధి రాజా’లో మమ్ముట్టికి జంటగా రాయ్లక్ష్మీ నటించడంతో ప్రస్తుత చిత్రంలోనూ మమ్ముట్టి సరసన ఆమెనే నటిస్తుందని మొదట భావించారు. అనివార్య కారణాలతో ఆమె నటించడానికి సాధ్యపడకపోవడంతో ఆ అవకాశం వరలక్ష్మిని వరించింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









