‘కసబా’ చిత్రంలో మమ్ముట్టి సరసన మళ్లీ వరలక్ష్మి
- April 06, 2017
తమిళంలో ‘పోడా పోడి’, ‘తారై తప్పట్టె’ చిత్రాల్లో నటించిన వరలక్ష్మి శరత్కుమార్ గత సంవత్సరం ‘కసబా’ చిత్రం ద్వారా మలయాళ చిత్రసీమకు పరిచయమయ్యారు. అందులో మమ్ముట్టి హీరోగా నటించారు. ఈ సంవత్సరం సముద్రగని దర్శకత్వంలోని ‘అప్పా’ తమిళ చిత్రం మలయాళంలో పునర్నిర్మించనుండగా అందులో నటించే అవకాశం వరలక్ష్మికి లభించినా పూజ జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో మలయాళ చిత్రంలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ఈ చిత్రంలోనూ హీరో మమ్ముట్టి కావడం గమనార్హం. మమ్ముట్టితో ‘రాజాధి రాజా’ అనే మలయాళ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజయ్ వాసుదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
‘రాజాధి రాజా’లో మమ్ముట్టికి జంటగా రాయ్లక్ష్మీ నటించడంతో ప్రస్తుత చిత్రంలోనూ మమ్ముట్టి సరసన ఆమెనే నటిస్తుందని మొదట భావించారు. అనివార్య కారణాలతో ఆమె నటించడానికి సాధ్యపడకపోవడంతో ఆ అవకాశం వరలక్ష్మిని వరించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







