‘కసబా’ చిత్రంలో మమ్ముట్టి సరసన మళ్లీ వరలక్ష్మి

- April 06, 2017 , by Maagulf
‘కసబా’ చిత్రంలో మమ్ముట్టి సరసన మళ్లీ వరలక్ష్మి

తమిళంలో ‘పోడా పోడి’, ‘తారై తప్పట్టె’ చిత్రాల్లో నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్‌ గత సంవత్సరం ‘కసబా’ చిత్రం ద్వారా మలయాళ చిత్రసీమకు పరిచయమయ్యారు. అందులో మమ్ముట్టి హీరోగా నటించారు. ఈ సంవత్సరం సముద్రగని దర్శకత్వంలోని ‘అప్పా’ తమిళ చిత్రం మలయాళంలో పునర్నిర్మించనుండగా అందులో నటించే అవకాశం వరలక్ష్మికి లభించినా పూజ జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో మలయాళ చిత్రంలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ఈ చిత్రంలోనూ హీరో మమ్ముట్టి కావడం గమనార్హం. మమ్ముట్టితో ‘రాజాధి రాజా’ అనే మలయాళ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజయ్‌ వాసుదేవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
‘రాజాధి రాజా’లో మమ్ముట్టికి జంటగా రాయ్‌లక్ష్మీ నటించడంతో ప్రస్తుత చిత్రంలోనూ మమ్ముట్టి సరసన ఆమెనే నటిస్తుందని మొదట భావించారు. అనివార్య కారణాలతో ఆమె నటించడానికి సాధ్యపడకపోవడంతో ఆ అవకాశం వరలక్ష్మిని వరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com