పాక్‌లో 'దంగల్‌'కు నో చెప్పిన బాలీవుడ్ నటుడు ఆమిర్‌ ఖాన్‌

- April 07, 2017 , by Maagulf
పాక్‌లో 'దంగల్‌'కు నో చెప్పిన బాలీవుడ్ నటుడు ఆమిర్‌ ఖాన్‌

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ తన తాజా చిత్రం ‘దంగల్‌’ను పాకిస్థాన్‌లో విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. 2016లో జమ్మూకశ్మీర్‌లోని ఉరీ దాడులు జరిగిన నేపథ్యంలో పాక్‌లో భారత సినిమాలను నిలిపివేశారు. ఆ తర్వాత గొడవలు సర్దుమణిగాక భారత సినిమాలపై నిషేధాన్ని పాక్‌ ఎత్తివేసింది. దంగల్‌ సినిమా విడుదలైనప్పుడు పాకిస్థాన్‌కి చెందిన లోకల్‌ డిస్ట్రిబ్యూటర్లు పాక్‌లోనూ సినిమా విడుదల చేయాలని కోరారు. ఇందుకు ఆమిర్‌ కూడా ఒప్పుకున్నారు. అయితే దంగల్‌ సినిమాలోని ఓ సన్నివేశంలో భారత జాతీయ జెండా, జాతీయ గీతం ఉండడంతో ఆ సన్నివేశాలని తొలగించాలని పాకిస్థాన్‌ సెన్సార్‌ బోర్డు ఆదేశించింది. ఇందుకు ఆమిర్‌ ఒప్పుకోలేదు.
ఈ క్రీడకు సంబంధించిన సినిమా అని.. ఇందులో భారత్‌-పాక్‌కు మధ్య ఎలాంటి సంబంధంలేదని అలాంటప్పుడు జాతీయ గీతం సన్నివేశాలను తొలగించాల్సిన అవసరమేంటని ఆమిర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మొత్తానికి సినిమాని పాకిస్థాన్‌లో విడుదల చేయడానికి ఆమిర్‌, సినీ బృందం ఒప్పుకోలేదని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com