పాక్లో 'దంగల్'కు నో చెప్పిన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్
- April 07, 2017
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన తాజా చిత్రం ‘దంగల్’ను పాకిస్థాన్లో విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. 2016లో జమ్మూకశ్మీర్లోని ఉరీ దాడులు జరిగిన నేపథ్యంలో పాక్లో భారత సినిమాలను నిలిపివేశారు. ఆ తర్వాత గొడవలు సర్దుమణిగాక భారత సినిమాలపై నిషేధాన్ని పాక్ ఎత్తివేసింది. దంగల్ సినిమా విడుదలైనప్పుడు పాకిస్థాన్కి చెందిన లోకల్ డిస్ట్రిబ్యూటర్లు పాక్లోనూ సినిమా విడుదల చేయాలని కోరారు. ఇందుకు ఆమిర్ కూడా ఒప్పుకున్నారు. అయితే దంగల్ సినిమాలోని ఓ సన్నివేశంలో భారత జాతీయ జెండా, జాతీయ గీతం ఉండడంతో ఆ సన్నివేశాలని తొలగించాలని పాకిస్థాన్ సెన్సార్ బోర్డు ఆదేశించింది. ఇందుకు ఆమిర్ ఒప్పుకోలేదు.
ఈ క్రీడకు సంబంధించిన సినిమా అని.. ఇందులో భారత్-పాక్కు మధ్య ఎలాంటి సంబంధంలేదని అలాంటప్పుడు జాతీయ గీతం సన్నివేశాలను తొలగించాల్సిన అవసరమేంటని ఆమిర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మొత్తానికి సినిమాని పాకిస్థాన్లో విడుదల చేయడానికి ఆమిర్, సినీ బృందం ఒప్పుకోలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







