తమిళనాడు లో ప్రముఖుల ఇంటిపై ఐటీ దాడులు
- April 07, 2017
నటుడు శరత్ కుమార్కు ఐటీ అధికారులు సడన్ షాకిచ్చారు.! జయలలిత మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో పలువురు ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు తమిళనాట కలకలం సృష్టిస్తున్నాయి. కాగా ఈ ఉప ఎన్నికలో శరత్ కుమార్.. దినకరణ్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంలో ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఇవాళ సాయంత్రం నుంచి కొట్టివక్కమ్లోని శరత్ కుమార్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే శరత్ కుమార్తో పాటు ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిపైనా ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. కాగా ఆరోగ్యమంత్రికి టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి సంబంధాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సోదాలకు సంబంధించి ఇంత వరకు ఐటీ అధికారులు ఎక్కడా వివరాలు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా









