తమిళనాడు లో ప్రముఖుల ఇంటిపై ఐటీ దాడులు
- April 07, 2017
నటుడు శరత్ కుమార్కు ఐటీ అధికారులు సడన్ షాకిచ్చారు.! జయలలిత మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో పలువురు ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు తమిళనాట కలకలం సృష్టిస్తున్నాయి. కాగా ఈ ఉప ఎన్నికలో శరత్ కుమార్.. దినకరణ్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంలో ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఇవాళ సాయంత్రం నుంచి కొట్టివక్కమ్లోని శరత్ కుమార్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే శరత్ కుమార్తో పాటు ఆరోగ్య మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిపైనా ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. కాగా ఆరోగ్యమంత్రికి టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి సంబంధాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సోదాలకు సంబంధించి ఇంత వరకు ఐటీ అధికారులు ఎక్కడా వివరాలు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







