జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ముగ్గురు మృతి
- April 07, 2017
స్వీడన్ స్టాక్హోం నగరంలో నిత్యం జనసమ్మర్దం ఉండే అహ్లెన్స్ మాల్పై ఓ మృత్యుశకటం విరుచుకుపడింది. ఓ దుండగుడు వేగంగా ట్రక్కును జనంపైకి దూకించడంతో వందలాది మంది హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. షారింగ్ ఏరియాలో ఓ ట్రక్కు స్వైరవిహారం చేయడం, జనాలు పరుగులెత్తడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. మెయిన్ స్ట్రీట్లోకి అడుగుపెట్టగానే భారీ ట్రక్కు అదుపు తప్పి వేగంగా దూసుకుపోవడం చూశానని, దీంతో పలువురు పరుగులు తీసినట్టు ఓ ప్రత్యక్ష్య సాక్షి తెలిపారు. లారీని ఎవరైనా డ్రైవ్ చేస్తున్నారా లేదా అనేది తాను చూడలేదన్నాడు. షాపింగ్ సెంటర్ వెలుపల వందలాది మంది ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని పరుగులు తీసినట్టు మరో ప్రత్యక్ష్య సాక్షి తెలిపారు. కాగా, ఇది ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆగంతకుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







