సిరియా ఎయిర్ బేస్ పై అమెరికా దాడి, 9 మంది మృతి
- April 07, 2017
తిరుగుబాటుదారులు లక్ష్యంగా సిరియాపై అమెరికా చేపట్టిన క్షిపణి దాడుల్లో 9 మంది మృతిచెందారు. సెంట్రల్ సిరియాలోని ఎయిర్బేస్పై చేసిన దాడుల్లో నలుగురు చిన్నారులు సహా 9 మంది పౌరులు మృతిచెందినట్లు సిరియా మీడియా వెల్లడించింది. సిరియాలోని తిరుగుబాటుదారులు అధికంగా ఉండే ప్రాంతాలపై అమెరికా క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. మధ్యధరా సముద్రంలోని యుద్ధనౌక నుంచి 59 తోమహౌక్ క్షిపణులను అమెరికా ప్రయోగించింది. సిరియాలో ఇటీవల జరిగిన రసాయన దాడులకు వ్యతిరేకంగానే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. సిరియాలో ఇటీవల రసాయన దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారులు సహా 70మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









