అమెరికాలో ఇండియన్ ని చంపిన దుండగులు
- April 07, 2017
అమెరికాలో మరో ఘోరం. దోపిడీ దొంగల చేతిలో 26 ఏళ్ల భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని యకిమా నగరంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే..
పంజాబ్కు చెందిన విక్రమ్ జర్యాల్.. నెలరోజుల క్రితమే అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం యకిమా సిటీలోని ఏఎం–పీఎం గ్యాస్స్టేషన్లో క్లర్కుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం(స్థానిక కాలమానం ప్రకారం) మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు విక్రమ్ పనిచేస్తోన్న స్టేషన్కు వచ్చి, డబ్బుకోసం బెదిరించారు. దీంతో విక్రమ్ స్టేషన్ కౌంటర్లో ఉన్న నగదును వారికి ఇచ్చాడు. అయినప్పటికీ ఆ ఇద్దరు దుండగుల్లో ఒకరు విక్రమ్పై కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ పారిపోయారు.
ఇది జాత్యహంకార దాడే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుండగులు వెళ్లిపోయిన తర్వాత కొందరు విక్రమ్ను గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఖండించిన విదేశాంగ మంత్రి
ఈ ఘటనను విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఖండించారు. విక్రమ్ సోదరుడు ఈ ఘటనను తన ట్విటర్ ఖాతాద్వారా సుష్మ దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని వెనక్కి రప్పించేందుకు చేయూత ఇవ్వాలని కోరారు. కాగా విక్రమ్...పంజాబ్లోని హోషియార్పూర్ వాసి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







