న్యూ ఢిల్లీ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్బుల్
- April 09, 2017
ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్బుల్ నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు. రక్షణ, భద్రత, ఇంధనం, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) ఈ పర్యటనలో కుదిరే అవకాశంలేదని ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. పర్యావరణం, పునరుత్పాదక ఇంధనం, క్రీడలు, వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ)లు కుదిరే అవకాశముందని తెలిపింది. 2015లో ఆస్ట్రేలియా ప్రధానిగా టర్న్బుల్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ఇదే తొలి భారత్ పర్యటన.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









