దుబాయ్ క్రీక్కి ఐదు అధునాతన అబ్రాస్
- September 30, 2015
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) ఐదు అధునాతన అబ్రాస్లను అందుబాటులోకి తెచ్చింది. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ అబ్రాస్లను డిజైన్ చేశారు. ఇవి దుబాయ్ క్రీక్లో ప్రయాణించనున్నాయి. ఐదు స్టేషన్లను కలిపే నాలుగు లైన్స్లో వీటిని నడుపుతారు. బనియాస్, అల్ సబ్కా, అల్ గుబైబా, దుబాయ్ ఓల్డ్ సౌక్ మరియు అల్ ఫహిది స్టేషన్లలో అబ్రాస్ అందుబాటులో ఉంటాయి. ఆర్టీఏ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్ మరియు డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తయెర్ చెబుతూ, ఆర్టీఏ మాస్టర్ ప్లాన్లో భాగంగా అబ్రాస్లను వినియోగించనున్నామని చెప్పారు. ఇంకో 12 కొత్త మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్లను బిజినెస్ బే కెనాల్ మరియు దుబాయ్ వాటర్ కెనాల్ను 2018 నాటికి నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. తక్కువ బరువుతో, ఇంతకు ముందున్న అబ్రాస్కి మూడు రెట్ల వేగంతో కొత్త అబ్రాస్ దూసుకుపోతాయి. కెరాటలపై అద్భుతమైన సమతౌల్యం ఈ కొత్త అబ్రాస్ల సొంతం. 2017 నాటికి 50 అబ్రాస్లు, 2019 నాటికి 100, 2020 నాటికి 150 అబ్రాస్లు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లుగా అల్ టేలర్ వెల్లడించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









