పేలని బాంబుతో ఆటలు.. చిన్నారులు మృతి
- April 11, 2017
కాబూల్: పేలకుండా పడిపోయ ఉన్న మోర్టార్ రౌండ్తో ఆడుకుంటూ నలుగురు చిన్నారులు మృత్యువాతపడిన విషాదకర ఘటన ఆఫ్ఘనిస్థాన్లో చోటుచేసుకుంది. తాలిబన్ల ఆధీనంలో ఉన్న కుందుజ్ రాష్ట్రంలో కొందరు చిన్నారులు మోర్టార్ రౌండ్తో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది పేలింది. దీంతో నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు చిన్నారులు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో యుద్ధాల కారణంగా ఎక్కడ పడితే అక్కడ పేలని బాంబులు, ప్రమాదకర వస్తువులు, మోర్టార్ రౌండ్స్ పడిపోయి ఉంటున్నాయి. అవి అకస్మాత్తుగా పేలడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి నెలా రోడ్ల పక్కన పడిన బాంబులు పేలి చనిపోయే, గాయాలపాలయ్యే వారి సంఖ్య దాదాపు 140 ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









