గల్ఫ్ వలసపోయిన తెలంగాణ వాసుల అంశాలపై కేంద్రంతో చర్చించిన కేటీఆర్

- April 11, 2017 , by Maagulf
గల్ఫ్ వలసపోయిన తెలంగాణ వాసుల అంశాలపై కేంద్రంతో చర్చించిన కేటీఆర్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో సౌదీ అరేబియా కాన్సులేట్ ఏర్పాటు అంశంపై చర్చించారు. గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలకు వలసపోయిన తెలంగాణ వాసుల అంశాలపై చర్చించారు. అక్కడివారి ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి వీకే సింగ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ వెంట టిఆర్ఎస్ ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com