పెట్రోల్ తాగి, తనను తాను కాల్చుకుని
- April 13, 2017
32 ఏళ్ళ షార్జా వ్యక్తి ఒకరు పెట్రోల్ తాగి, తనను తాను కాల్చుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. షార్జా పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టారు. రాత్రి 9.30 నిమిషాల సమయంలో ఆపరేషన్ రూమ్ - అల్ మదమ్ పోలీస్ స్టేషన్కి ఓ ఫోన్ కాల్ వచ్చిందనీ, దాంతో టీమ్ని పంపామనీ, అక్కడ ఓ వ్యక్తి క్రిటికల్ కండిషన్లో కన్పించాడని తెలిపారు పోలీసులు. అల్ ధయిద్ ఆసుపత్రిలో అతన్ని చేర్చారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నారతనికి. పెట్రోల్ని తాగి, తనను తాను కాల్చుకోవడంతో అతని శరీరంపై కాలిన గాయాలున్నాయి. పొగను పీల్చడంతో శ్వాస అందని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. మానసిక సమస్యలతోనే ఆ వ్యక్తి ఇలా చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ఇది అతనికి రెండో సూసైడ్ అటెంప్ట్ అని విచారణలో తేలింది. గతంలో హై రైజ్ బిల్డింగ్ పై నుంచి దూకి, ప్రాణాలతో బయటపడ్డాడు.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







