పెట్రోల్‌ తాగి, తనను తాను కాల్చుకుని

- April 13, 2017 , by Maagulf
పెట్రోల్‌ తాగి, తనను తాను కాల్చుకుని

32 ఏళ్ళ షార్జా వ్యక్తి ఒకరు పెట్రోల్‌ తాగి, తనను తాను కాల్చుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. షార్జా పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టారు. రాత్రి 9.30 నిమిషాల సమయంలో ఆపరేషన్‌ రూమ్‌ - అల్‌ మదమ్‌ పోలీస్‌ స్టేషన్‌కి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చిందనీ, దాంతో టీమ్‌ని పంపామనీ, అక్కడ ఓ వ్యక్తి క్రిటికల్‌ కండిషన్‌లో కన్పించాడని తెలిపారు పోలీసులు. అల్‌ ధయిద్‌ ఆసుపత్రిలో అతన్ని చేర్చారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నారతనికి. పెట్రోల్‌ని తాగి, తనను తాను కాల్చుకోవడంతో అతని శరీరంపై కాలిన గాయాలున్నాయి. పొగను పీల్చడంతో శ్వాస అందని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. మానసిక సమస్యలతోనే ఆ వ్యక్తి ఇలా చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ఇది అతనికి రెండో సూసైడ్‌ అటెంప్ట్‌ అని విచారణలో తేలింది. గతంలో హై రైజ్‌ బిల్డింగ్‌ పై నుంచి దూకి, ప్రాణాలతో బయటపడ్డాడు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com