పెట్రోల్ తాగి, తనను తాను కాల్చుకుని
- April 13, 2017
32 ఏళ్ళ షార్జా వ్యక్తి ఒకరు పెట్రోల్ తాగి, తనను తాను కాల్చుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. షార్జా పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టారు. రాత్రి 9.30 నిమిషాల సమయంలో ఆపరేషన్ రూమ్ - అల్ మదమ్ పోలీస్ స్టేషన్కి ఓ ఫోన్ కాల్ వచ్చిందనీ, దాంతో టీమ్ని పంపామనీ, అక్కడ ఓ వ్యక్తి క్రిటికల్ కండిషన్లో కన్పించాడని తెలిపారు పోలీసులు. అల్ ధయిద్ ఆసుపత్రిలో అతన్ని చేర్చారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నారతనికి. పెట్రోల్ని తాగి, తనను తాను కాల్చుకోవడంతో అతని శరీరంపై కాలిన గాయాలున్నాయి. పొగను పీల్చడంతో శ్వాస అందని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. మానసిక సమస్యలతోనే ఆ వ్యక్తి ఇలా చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ఇది అతనికి రెండో సూసైడ్ అటెంప్ట్ అని విచారణలో తేలింది. గతంలో హై రైజ్ బిల్డింగ్ పై నుంచి దూకి, ప్రాణాలతో బయటపడ్డాడు.
తాజా వార్తలు
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







