పెట్రోల్ తాగి, తనను తాను కాల్చుకుని
- April 13, 2017
32 ఏళ్ళ షార్జా వ్యక్తి ఒకరు పెట్రోల్ తాగి, తనను తాను కాల్చుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. షార్జా పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టారు. రాత్రి 9.30 నిమిషాల సమయంలో ఆపరేషన్ రూమ్ - అల్ మదమ్ పోలీస్ స్టేషన్కి ఓ ఫోన్ కాల్ వచ్చిందనీ, దాంతో టీమ్ని పంపామనీ, అక్కడ ఓ వ్యక్తి క్రిటికల్ కండిషన్లో కన్పించాడని తెలిపారు పోలీసులు. అల్ ధయిద్ ఆసుపత్రిలో అతన్ని చేర్చారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నారతనికి. పెట్రోల్ని తాగి, తనను తాను కాల్చుకోవడంతో అతని శరీరంపై కాలిన గాయాలున్నాయి. పొగను పీల్చడంతో శ్వాస అందని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. మానసిక సమస్యలతోనే ఆ వ్యక్తి ఇలా చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ఇది అతనికి రెండో సూసైడ్ అటెంప్ట్ అని విచారణలో తేలింది. గతంలో హై రైజ్ బిల్డింగ్ పై నుంచి దూకి, ప్రాణాలతో బయటపడ్డాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!









