మోహన్లాల్ హీరోగా గిన్నిస్ అందుకున్న 'మన్యంపులి'
- April 15, 2017మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన చిత్రం 'పులి మురుగన్'. కేవలం పాతికకోట్లతో దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది సూపర్డూపర్ హిట్ అయింది. ఇంతకీ విషయమేంటంటే.. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఓ అరుదైన రికార్డ్ సాధించింది. ఇటీవలే ఈ మూవీ త్రీడీ వెర్షన్ని కేరళలోని తిరువనంతపురంలో ఉండే అడ్లక్స్ థియోటర్లో దాదాపు 20 వేల మంది వీక్షించారు. ఇలా ఏకంగా ఒకేసారి 20వేల మంది త్రీడీ చిత్రాన్ని వీక్షించటం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీంతో గిన్నిస్ రికార్డ్ వరించింది. 2012 సంవత్సరంలో హాలీవుడ్ చిత్రం 'మెన్ ఇన్ బ్లాక్'ను ఆరువేల మంది ప్రేక్షకులు త్రీడీలో వీక్షించారు. ప్రస్తుతం ఆ రికార్డును 'పులి మురుగన్' ఊహించని స్థాయిలో వెనక్కి నెట్టేసింది. బాక్సాఫీస్ దగ్గరే కాదు రికార్డుల్లోనూ మలయాళ పులి గర్జించిందనమాట!
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!