బ్రిటన్ రాజధాని నైట్ క్లబ్లో యాసిడ్ దాడి
- April 17, 2017
లండన్: బ్రిటన్ రాజధాని లండన్ ప్రజలు యాసిడ్ దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం తెల్లవారుజామున కిక్కిరిసిన ఓ నైట్ క్లబ్లో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన యాసిడ్ దాడిలో 12 మంది గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, ఈ దాడిలో ఉగ్రవాదులకు సంబంధముందని భావించడం లేదని పోలీసులు తెలిపారు.
దాడి జరిగిన సమయంలో నైట్ క్లబ్లో దాదాపు 600 మంది ఉన్నారు. నైట్ క్లబ్లో ఉన్నవారిపై గుర్తు తెలియని ప్రమాదకర పదార్థాన్ని చెల్లారని లండన్ ఫైర్ బ్రిగేడ్ ప్రతినిధి చెప్పారు. పరీక్షల్లో ఇది ఓ ఆమ్ల పదార్థంగా తేలిందని ఆయన తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులకు సమాచారం రావడంతో వారు ఘటన స్థలానికి వెళ్లి, క్లబ్కు వెళ్లే దారులన్నీ మూసివేయించి విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. 2010 తర్వాత లండన్లో యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. దాదాపు 1800 కేసులు నమోదయ్యాయి. కొన్ని క్రిమినల్ గ్యాంగులు ఈ దాడులు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల లండన్లోనే జరిగిన యాసిడ్ దాడిలో భార్యాభర్తలు, వారి మూడేళ్ల కొడుకు గాయపడ్డారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









