మహాభారతకు భారీగా పెట్టుబడి
- April 17, 2017
ప్రముఖ యాడ్ ఫిలిం రూపకర్త వి.ఎ. శ్రీకుమార్ మేనన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న చిత్రం ‘ది మహాభారత’. ఈ సినిమా కోసం యూఏఈకి చెందిన ఓ భారతీయ వ్యాపారవేత్త ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాడట. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. తొలుత ఈ సినిమాని ఆంగ్లం, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో తెరక్కించనున్నారు. ఆ తర్వాత 100 విదేశీ భాషల్లోనూ డబ్బింగ్ చేయనున్నారు. ఇందులో నటీనటులను టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంపికచేసుకోనున్నారు. నటీనటులను ఓ అంతర్జాతీయ దర్శకుడు ఎంపికచేయనున్నారు.
ఈ సినిమాని ప్రముఖ రచయిత ఎం.టి వాసుదేవన్ నాయర్ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఇందులో ఎక్కువ భాగం భీముడి గురించే ఉంటుంది. 2018లో సినిమా చిత్రీకరణ ప్రారంభంకానుంది. 2020 నాటికి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







