భారత్ భారీ ఒప్పందం కొరియాతో
- April 18, 2017
సముద్రాల్లో గనులను ధ్వంసం చేయడానికి లేదా గుర్తించడానికి ఉపయోగపడే 12 పెద్ద ఓడల నిర్మాణానికి భారత నావికా దళం దక్షిణ కొరియా రక్షణ సంస్థతో ఒప్పందం చేసుకోనుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.35 వేల కోట్లు వ్యయం కానుంది. ఈమేరకు గోవా షిప్యార్డ్, దక్షిణ కొరియా సంస్థకు మధ్య నెలకొన్న సమస్యలన్నీ కొలిక్కి వచ్చాయని, ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని నేవీ యుద్ధ నౌకల ఉత్పత్తి, సేకరణ కంట్రోలర్ వైస్ అడ్మిరల్ డీఎం దేశ్పాండే తెలిపారు.
ల్యాండింగ్ ప్లాట్ఫాం డాక్(ఎల్పీడీ)ల కొనుగోలుకు ఒప్పందాన్ని కూడా ఈ ఏడాది చివరి నాటికి ఖరారు చేస్తామని వెల్లడించారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఫిక్కీ సదస్సులో ఆయన ఈ విషయాలు తెలిపారు. 20 వేల టన్నుల బరువున్న 4 ఎల్పీడీలను కొనుగోలు చేయాలని నేవీ యోచిస్తోంది.
స్వదేశీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ రెండో దశ ప్రాజెక్టు(ఐఏసీ–2)కు నిధుల విడుదల కోసం రాబోయే 3–4 నెలల్లో రక్షణ శాఖను సంప్రదిస్తామని దేశ్పాండే చెప్పారు. 57 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కూడా నావికా దళం యోచిస్తోందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ సహకారంతో ముంబైలో నిర్మిస్తున్న 6 స్కార్పీన్ తరగతి జలాంతర్గాములకు అదనంగా మరిన్ని జలాంతర్గాముల అవసరం నేవీకి ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







