భారత్ భారీ ఒప్పందం కొరియాతో
- April 18, 2017
సముద్రాల్లో గనులను ధ్వంసం చేయడానికి లేదా గుర్తించడానికి ఉపయోగపడే 12 పెద్ద ఓడల నిర్మాణానికి భారత నావికా దళం దక్షిణ కొరియా రక్షణ సంస్థతో ఒప్పందం చేసుకోనుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.35 వేల కోట్లు వ్యయం కానుంది. ఈమేరకు గోవా షిప్యార్డ్, దక్షిణ కొరియా సంస్థకు మధ్య నెలకొన్న సమస్యలన్నీ కొలిక్కి వచ్చాయని, ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని నేవీ యుద్ధ నౌకల ఉత్పత్తి, సేకరణ కంట్రోలర్ వైస్ అడ్మిరల్ డీఎం దేశ్పాండే తెలిపారు.
ల్యాండింగ్ ప్లాట్ఫాం డాక్(ఎల్పీడీ)ల కొనుగోలుకు ఒప్పందాన్ని కూడా ఈ ఏడాది చివరి నాటికి ఖరారు చేస్తామని వెల్లడించారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఫిక్కీ సదస్సులో ఆయన ఈ విషయాలు తెలిపారు. 20 వేల టన్నుల బరువున్న 4 ఎల్పీడీలను కొనుగోలు చేయాలని నేవీ యోచిస్తోంది.
స్వదేశీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ రెండో దశ ప్రాజెక్టు(ఐఏసీ–2)కు నిధుల విడుదల కోసం రాబోయే 3–4 నెలల్లో రక్షణ శాఖను సంప్రదిస్తామని దేశ్పాండే చెప్పారు. 57 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కూడా నావికా దళం యోచిస్తోందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ సహకారంతో ముంబైలో నిర్మిస్తున్న 6 స్కార్పీన్ తరగతి జలాంతర్గాములకు అదనంగా మరిన్ని జలాంతర్గాముల అవసరం నేవీకి ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







