భారత్ భారీ ఒప్పందం కొరియాతో
- April 18, 2017
సముద్రాల్లో గనులను ధ్వంసం చేయడానికి లేదా గుర్తించడానికి ఉపయోగపడే 12 పెద్ద ఓడల నిర్మాణానికి భారత నావికా దళం దక్షిణ కొరియా రక్షణ సంస్థతో ఒప్పందం చేసుకోనుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.35 వేల కోట్లు వ్యయం కానుంది. ఈమేరకు గోవా షిప్యార్డ్, దక్షిణ కొరియా సంస్థకు మధ్య నెలకొన్న సమస్యలన్నీ కొలిక్కి వచ్చాయని, ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని నేవీ యుద్ధ నౌకల ఉత్పత్తి, సేకరణ కంట్రోలర్ వైస్ అడ్మిరల్ డీఎం దేశ్పాండే తెలిపారు.
ల్యాండింగ్ ప్లాట్ఫాం డాక్(ఎల్పీడీ)ల కొనుగోలుకు ఒప్పందాన్ని కూడా ఈ ఏడాది చివరి నాటికి ఖరారు చేస్తామని వెల్లడించారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఫిక్కీ సదస్సులో ఆయన ఈ విషయాలు తెలిపారు. 20 వేల టన్నుల బరువున్న 4 ఎల్పీడీలను కొనుగోలు చేయాలని నేవీ యోచిస్తోంది.
స్వదేశీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ రెండో దశ ప్రాజెక్టు(ఐఏసీ–2)కు నిధుల విడుదల కోసం రాబోయే 3–4 నెలల్లో రక్షణ శాఖను సంప్రదిస్తామని దేశ్పాండే చెప్పారు. 57 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కూడా నావికా దళం యోచిస్తోందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ సహకారంతో ముంబైలో నిర్మిస్తున్న 6 స్కార్పీన్ తరగతి జలాంతర్గాములకు అదనంగా మరిన్ని జలాంతర్గాముల అవసరం నేవీకి ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







