సేఫ్ స్కూట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్పై ఫోకస్
- April 19, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, భద్రతతో కూడిన మోడర్న్ స్కూల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఎడ్యుకేషన్ అండ్ కరికులమ్ అండర్ సెక్రెటరీ డాక్టర్ హమౌద్ బిన్ ఖల్ఫాన్ అల్ హార్తి చెప్పారు. ప్రస్తుత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని విశ్లేసించడంతోపాటుగా, పాత బస్సుల్ని సరికొత్త తరహా బస్సులతో రీప్లేస్ చేయడం గురించీ చర్చిస్తున్నామని డాక్టర్ హార్తి చెప్పారు. 700,000 మంది విద్యార్థులు, స్కూల్ బస్సుల ద్వారా స్కూళ్ళకు వెళుతున్నారనీ, మవసలాత్ ఈ బస్సుల్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుపుతోందని వివరించారాయన. 4,000 బస్సులతో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, ఇందులో 500 బస్సులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలవని చెప్పారు డాక్టర్ హార్తి. అత్యాధునిక బస్సులు వినియోగించడంతోపాటుగా, డ్రైవర్లకు ట్రాఫిక్ సేఫ్టీ కోసం వర్క్ షాపులు నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. 220 మంది డ్రైవర్లక ఇప్పటికే ఇక్షణ ఇప్పించినట్లు మవసలాత్ డిజి బదర్ అల్ నద్బి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









